हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

India-China: భారత్, చైనా సంబంధాలు మెరుగవుతున్నాయా?

Vanipushpa
India-China: భారత్, చైనా సంబంధాలు మెరుగవుతున్నాయా?

భారత్, చైనాలు తమ సరిహద్దుల్లో ఏళ్ల తరబడి ఉద్రిక్తతల తర్వాత నెమ్మదిగా సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల భారత్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రతినిధులు చైనాను సందర్శించడాన్ని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా చూస్తున్నారు. జూన్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు వేరువేరుగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల కోసం చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో చైనాలో పర్యటించిన మొదటి సీనియర్ భారత ప్రతినిధి రాజ్‌నాథ్ సింగ్ మాత్రమే.

భారత్, చైనా మధ్య ప్రధాన సమస్య

భారత్, చైనా మధ్య ప్రధాన సమస్య వారి 3,440 కిలోమీటర్ల సరిహద్దు. కొన్నిచోట్ల ఇది స్పష్టంగా గుర్తించలేదు. నదులు, సరస్సులు, మంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో సరిహద్దు మారుతుంటుంది, దీనివల్ల రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలున్నాయి.
కీలక ఒప్పందాలు
2020 జూన్‌లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1975 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సైనికులు ప్రాణాలు పోయినంతటి తీవ్ర పోరాటం ఇదే. ఈ ఘటనలో కనీసం ఇరవై మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు. అప్పటి నుంచి, రెండు వైపులా సైనిక ప్రతిష్టంభనలు నెలకొన్నాయి. కానీ, ఇప్పుడు వారు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిరుడు లద్దాఖ్ ప్రాంతంలో కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి భారత్, చైనాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను జనవరిలో తిరిగి ప్రారంభించారు, వీసా ఆంక్షలను సడలించారు.

India-China: భారత్, చైనా సంబంధాలు మెరుగవుతున్నాయా?
India-China: భారత్, చైనా సంబంధాలు మెరుగవుతున్నాయా?

భారత యాత్రికులకు అనుమతులు

ఆరేళ్ల తర్వాత భారత యాత్రికులకు టిబెట్‌ అటానమస్ రీజియన్‌లోని ‘పవిత్ర కైలాశ పర్వతం’, సరస్సును సందర్శించడానికి అనుమతులు లభించాయి. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య సవాళ్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. నిరుడు చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. భారత్ ముఖ్యంగా అరుదైన భూఖనిజాల(రేర్ ఎర్త్ మినరల్స్) కోసం చైనాపై ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి చాలా అవసరం.
చైనా ఎక్కువగా తైవాన్‌పైనే దృష్టి
చైనా ఎక్కువగా తైవాన్‌పైనే దృష్టి పెడుతోంది, కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడి హిమాలయ సరిహద్దులో భారత్‌తో శాంతిని కోరుకుంటోంది. కానీ, తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇండియాను ఉపయోగిస్తున్నాయని చైనా అనుమానిస్తోంది. కాబట్టి, సరిహద్దు వద్ద శాంతితో పాటు భారత్ విషయంలో ఇతర అంశాలలోనూ మెరుగుదల కోరుకుంటోంది చైనా. భారతదేశంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, తమ కార్మికులు, ఇంజినీర్లపై వీసా నిషేధాలను ఎత్తివేయాలని చైనా ఆశిస్తోంది (2020 సరిహద్దు ఘర్షణ తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది, చైనా పెట్టుబడులను పరిమితం చేసింది.

సరిహద్దు సమస్య పరిష్కరించుకుంటేనే..
చైనా తన వాణిజ్యాన్ని పెంచుకోవాలనుకున్నప్పటికీ, భారతదేశంతో తన సరిహద్దు వివాదాలపై వెనక్కి తగ్గడంలేదు. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను “దక్షిణ టిబెట్” అని పిలుస్తూ చైనా తన వాదనను పెంచుతోంది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో పూర్తి భాగమని దిల్లీ నొక్కి చెబుతోంది, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేస్తారని అంటోంది. ఈ నేపథ్యంలో “చైనా, భారత్ సార్వభౌమాధికార భావనను వదులుకోకపోతే, వారు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారు” అని షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ షెన్ డింగ్లీ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌పై వారు ఒక ఒప్పందానికి రాగలిగితే, రెండు దేశాలు శాశ్వత శాంతిని పొందుతాయని షెన్ అభిప్రాయపడ్డారు .

భారతదేశం చైనాకు ఎందుకు ముఖ్యమైనది?
సిల్క్ రోడ్డు భారతదేశం మరియు చైనా మధ్య ప్రధాన వాణిజ్య మార్గంగా పనిచేయడమే కాకుండా, భారతదేశం నుండి తూర్పు ఆసియాకు బౌద్ధమతం వ్యాప్తి చెందడానికి దోహదపడింది. 19వ శతాబ్దంలో, భారతదేశంలో పండించిన నల్లమందును ఎగుమతి చేసే ఈస్ట్ ఇండియా కంపెనీతో చైనా పెరుగుతున్న నల్లమందు వ్యాపారంలో పాల్గొంది.
1967 భారత-చైనా యుద్ధంలో ఎవరు గెలిచారు?
1967 నాటి నాథు లా మరియు చో లా ఘర్షణలలో చైనాతో జరిగిన ఘర్షణలలో భారతదేశం విజయం సాధించింది. ఈ ఘర్షణలు, 1962 యుద్ధం కంటే చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ, భారతదేశానికి గణనీయమైన విజయం, 1962 ఓటమి తర్వాత ఆత్మస్థైర్యాన్ని పెంచాయి మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించాయి. భారత సైన్యం నాథు లా మరియు చో లా రెండింటిలోనూ చైనా దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది, భారీ ప్రాణనష్టం కలిగించింది మరియు చైనీయులను వెనక్కి తగ్గేలా చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870