పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ‘సుమన్ టీవీ’తో మాట్లాడిన ఆయన, సినిమా విడుదల జాప్యంపై, దర్శకుడి మార్పుపై కీలక విషయాలను వెల్లడించారు.
విడుదల జాప్యంపై నిర్మాత వివరణ
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా వాయిదా పడటంపై వస్తున్న వార్తలపై నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam) స్పందించారు. “నేను ఒకసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తరువాత దానిని ఎప్పుడూ మార్చలేదు. కానీ ‘వీరమల్లు’ విషయంలో అలా జరగకపోవడంతో నేను చాలా ఫీలయ్యాను. ఇక ఈ సినిమా ఇప్పటివరకూ 14 సార్లు వాయిదా పడిందనే ప్రచారం కూడా నాకు చాలా బాధను కలిగించింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేస్తూ, “ఇంతవరకూ ఈ సినిమా 3 మార్లు మాత్రమే వాయిదా వేశాము. అది కూడా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారు రాజకీయాలలో బిజీగా ఉండటం వలన రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోయాము” అని తెలిపారు. పవన్ కల్యాణ్ రాజకీయ షెడ్యూల్ కారణంగానే సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, ఇతరత్రా కారణాలు ఏవీ లేవని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలతో సినిమా వాయిదాల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టినట్లైంది.

దర్శకుడి మార్పు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు
దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలను కూడా ఏఎం రత్నం వెల్లడించారు. “ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం, ఆయనకి మరో కమిట్ మెంట్ ఉండటమే. వేరే సినిమాకు ఆయన కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను తన అబ్బాయి జ్యోతికృష్ణకు అప్పగించమని చెప్పింది కూడా పవన్ కల్యాణ్ గారే అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సూచన మేరకే ఈ మార్పు జరిగిందని ఆయన తెలిపారు.
సినిమా విడుదలకు ముందు అభిమానుల కోసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. “ఈ సినిమా విడుదలకి 4 రోజులు ముందు ప్రీ రిలీజ్ ఈవెంటు చేయాలని అనుకుంటున్నాము. ఆ సమయానికి వర్షాలు లేకపోతే తిరుపతిలో.. వర్షాలు ఉంటే విజయవాడ – ఇండోర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము” అని ఏఎం రత్నం చెప్పారు. ఈవెంట్ వేదికపై వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పవన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలోనే తెరపైకి రానుంది.
హరి హర వీర మల్లు రియల్ స్టోరీ?
హరి హర వీరమల్లు పూర్తిగా కల్పిత కథ ఆధారంగా రూపొందించబడిన చారిత్రాత్మక యాక్షన్ డ్రామా. మొగల్ యుగంలో జరిగిన సంఘటనల నేపథ్యాన్ని కలిపి ఊహాత్మక కథనంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు.
హరి హర వీరమల్లు సినిమాను ఎన్ని పార్ట్స్గా రూపొందిస్తున్నారు?
దర్శకుల ప్రకారం ఇది రెండు పార్ట్స్గా ఉంది, భవిష్యత్తులో విజయానికి అనుగుణంగా మరింత భాగాలు తీసుకురావచ్చు
Read hindi news: hindi.vaartha.com
Read also: Saiyaara: ‘సయారా’ ట్రైలర్ చూసారా!