हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

MM Keeravaani: కీరవాణి తండ్రి మృతి..చంద్రబాబు నారా లోకేష్ సంతాపం

Sharanya
MM Keeravaani: కీరవాణి తండ్రి మృతి..చంద్రబాబు నారా లోకేష్ సంతాపం

ఆస్కార్ అవార్డు గ్రహీత, భారతదేశానికి గర్వకారణమైన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి, ప్రముఖ సినీ గీత రచయిత, చిత్రకారుడు కోడూరి శివశక్తి దత్తా అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ, సాహిత్య, రాజకీయ రంగాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. శివశక్తి దత్తా గారి మృతి (Death of Shivashakti Dutta) పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారు కీరవాణి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శివశక్తి దత్తా – ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి

కోడూరి శివశక్తి దత్తా గారు కేవలం గీత రచయితగానే కాకుండా, చిత్రకారుడిగా, రచయితగా, భాషాపండితుడిగా తెలుగు సాహిత్యానికే ఓ మేధావిగా నిలిచారు. ‘బాహుబలి’, ‘అనామిక’, ‘గజిని’, ‘మర్యాద రామన్న’ వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ సందర్భంగా మాట్లాడుతూ, శివశక్తి దత్తా మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తన అద్భుతమైన రచనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన రాసిన పాటలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించడం తెలుగు వారందరికీ గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. శివశక్తి దత్తా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కీరవాణి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి నారా లోకేశ్ సంతాపం

లోకేశ్ గారు కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ప్రకటనలో, కేవలం గీత రచయితగానే కాకుండా, చిత్రకారుడిగా కూడా సినీ రంగానికి ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. తన అసాధారణ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప కళాకారుడని లోకేశ్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు .

శివశక్తి దత్త వయస్సు ఎంత?

92 years, (8 October 1932)

శివశక్తి దత్త తండ్రి ఎవరు?

శివశక్తి దత్తా 8 అక్టోబర్ 1932న కోడూరి సుబ్బారావుగా జన్మించారు. ఆయన కుటుంబం ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందినది. ఆయన తండ్రి కోడూరి విజయ అప్పారావు . 

Read hindi news: hindi.vaartha.com

Read also: Nara Lokesh: యేడాదిలో రెండుసార్లు పేరెంట్లు, టీచర్ల భేటీ: మంత్రి లోకేష్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870