వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కడపలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులకు (To TDP leaders) కఠిన పాఠం చెబుతామంటూ సూటిగా హెచ్చరించారు.”రప్పా రప్పా… తిరిగొస్తే సినిమా చూపిస్తాం” అని వ్యాఖ్యానించిన రవీంద్రనాథ్, ప్రతి కార్యకర్త ఒక బుక్ తెచ్చుకుని టీడీపీ నాయకుల పేర్లు రాయాలని సూచించారు. ఎవరెవరు ప్రజలపై దాడులు చేశారో, కేసులు పెట్టించారో గుర్తుపెట్టుకుని జాబితా తయారు చేయాలన్నారు. జగన్ మళ్లీ సీఎంగా వస్తే, ఆ జాబితాలోని ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేసులకీ కంగారు వద్దు
కేసులు వస్తాయనే భయంతో వెనక్కి తగ్గొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. “ఎవరి మీద ఎక్కువ కేసులుంటాయో, వాళ్లకే అధికారంలో ప్రాధాన్యత ఉంటుంది,” అని జోక్ లా చెప్పిన ఆయన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఉత్సాహపరిచాయి. రాజకీయంగా బలంగా నిలబడాలంటే పోరాటం తప్పదన్న ఉద్దేశంతో మాట్లాడారు.
జమిలి ఎన్నికల్లో వైసీపీదే గెలుపు
త్వరలో జరగబోయే జమిలి ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని, ‘జగన్ 2.0’ పాలన ప్రారంభమవుతుందని రవీంద్రనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ పట్ల విశ్వాసం గట్టిగా ఉన్నదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మేనిఫెస్టో అమలుపై టీడీపీని నిలదీయండి
టీడీపీ నేతలు తమ హామీలు నెరవేర్చలేదని ఆరోపించిన ఆయన, వాటిపై ప్రతి ప్రాంతంలో ప్రజలముందు టీడీపీ నాయకులను నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటల గురించి ప్రశ్నించాలి అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీనియర్ నేత అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేదికపై చేసిన ఈ ప్రకటనల వల్ల వైసీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపించింది.
Read Also : Aryan Singh : ఫాల్కన్ కంపెనీ సీఓఓను అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ