हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Lucknow: యువతి బాత్రూంలో సీసీ కెమెరా అమర్చిన ఇంటి యజమాని

Sharanya
Lucknow: యువతి బాత్రూంలో సీసీ కెమెరా అమర్చిన ఇంటి యజమాని

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక మహిళ భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. బహ్రైచ్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగ అవసరాల కోసం లక్నోలోని దుబగ్గా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. సాధారణంగా కనిపించే ఈ అద్దె ఇల్లు ఓ ఆత్మగౌరవ మహిళ జీవితాన్ని క్షణాల్లో భయభ్రాంతులకు గురిచేసింది.

బాత్రూంలో రహస్య కెమెరా – మానవత్వాన్ని మరిచిన యజమాని

వివరాల్లోకి వెళితే, బహ్రైచ్‌కు చెందిన ఓ యువతి లక్నోలో అద్దె ఇంట్లో (rented house in Lucknow) నివసిస్తోంది. ఈ నెల జూన్ 24న తన బాత్రూంలో ఓ రహస్య కెమెరా ఉండటాన్ని ఆమె గమనించి షాక్‌కు గురైంది. దాన్ని పరిశీలించగా, వైఫైకి కనెక్ట్ చేసి ఉందని గుర్తించింది. వెంటనే ఆ కెమెరాను తొలగించగా, ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు.

బహిరంగం చేస్తానన్న బాధితురాలిపై అత్యాచార యత్నం

ముందుగా తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. అయితే, పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేస్తానని బాధితురాలు హెచ్చరించడంతో అతడిలోని మృగం బయటపడింది. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని, ఈ విషయం బయటకు చెబితే ఆమె తల్లిని చంపేస్తానని, సోదరిపై అత్యాచారం చేస్తానని తీవ్రంగా బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ధైర్యం – పోలీసులకు ఫిర్యాదు

బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి దుబగ్గా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుబగ్గా పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అభినవ్ వర్మ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Special trains: తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870