అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ మధ్యనే జరిగిన తానా (Telugu Association of North America) 24వ ద్వైవార్షిక మహాసభలు రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (Raghurama Krishnam Raju) ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయన తనదైన చమత్కారమైన భాషలో చేసిన వ్యాఖ్యలు సభను కడుపుబ్బ నవ్వించాయి.

యాంకర్ ప్రశ్న – రఘురామ ప్రతిస్పందన:
ఈ కార్యక్రమంలో యాంకర్ మూర్తి చేసిన ఓ ప్రశ్న సభలో నవ్వులు పూయించింది. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ (Raghurama Krishnam Raju) బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా (Minister of Medical Health) పనిచేస్తానని అన్నారు.
“రెడ్ బుక్ ఉంది?” – యాంకర్
ఆ తర్వాత యాంకర్ మూర్తి మరో ఆసక్తికర ప్రశ్న చేశారు. మీరు హోంమంత్రి అయితే రెడ్ బుక్ అమలు చేస్తారా అని యాంకర్ మూర్తి అడగ్గా తన వద్ద రెడ్ బుక్ ఉండదని, అది వేరే వాళ్ల వద్ద ఉందని రఘురామ బదులిచ్చారు. అయితే, తనదగ్గర బ్లడ్ బుక్ (Blood Book) ఉందని స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్ తో ముందుకెళతానని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా “బ్లడ్ బుక్” అనే పదాన్ని వినిపించగానే సభలో ఉన్నవారంతా శబ్దంతో స్పందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagan: తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్