బీహార్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర తలకెక్కిన అంశంగా మారిన ఒక సంఘటన — పాట్నాలో చోటుచేసుకున్న ప్రముఖ వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య (Gopal Khemka Murder) . ఇది కేవలం ఓ వ్యక్తి హత్యకే పరిమితమవకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందనే చర్చకు తెరలేపింది.

ఘటన వివరాలు
గోపాల్ ఖేమ్కా అనే వ్యాపారి పాట్నాలో ఉదయం తన వ్యాపార కార్యాలయానికి వెళ్తుండగా, అజ్ఞాత వ్యక్తులు అతన్ని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
రాహుల్ గాంధీ విమర్శలు
ఈ దారుణ హత్యపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తీవ్రంగా స్పందించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం (Nitish Kumar government) పై విరుచుకుపడుతూ ఎన్డీయే పాలనలో బీహార్ ‘భారతదదేశం నేర రాజధాని’గా మారిపోయిందని ఆరోపించారు. “ప్రస్తుతం బీహార్ దోపిడీలు, కాల్పులు, హత్యల నీడన బతుకుతోంది. ఇక్కడ నేరాలు సర్వసాధారణమైపోయాయి, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బీహార్ను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆర్జేడీ స్పందన
కేవలం రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాత్రమే కాదు, బీహార్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పట్నా నడిబొడ్డున ఈ దారుణం జరిగితే, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందని ఆయన ఆరోపించారు. “ఇది చాలా భయంకరమైన సంఘటన. వ్యాపారవేత్తలు బీహార్ విడిచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజకీయ ప్రభావం
ఈ హత్య ఒక పక్కా నేర సంఘటన మాత్రమే కాదు, రాజకీయంగా కూడ ఎన్డీయే కూటమికి మిగిలే కాలంలో కఠిన పరీక్షగా మారింది. ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో, ఇది అధికార కూటమికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Narendra Modi: దలైలామా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ