అమెరికాలో ఇటీవల జరిగిన క్వాడ్ దేశాల (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉత్తర కొరియా అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించాలి అనే అంశంపై సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో ఉత్తర కొరియా (North Korea) తన అణ్వాయుధాలను వదులుకోవాలని, ఆ దేశం చేస్తున్న సైబర్ ముప్పు కూడా ప్రపంచానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దీనిపై ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
US అసత్య ప్రచారం చేస్తోంది – KCNA ప్రకటన
ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ KCNA విడుదల చేసిన ప్రకటనలో, తమ దేశంపై అమెరికా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించింది. సైబర్ ముప్పు, హ్యాకింగ్ ప్రయత్నాలు అంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. తమ రక్షణ అవసరాల కోసమే అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూన్నామని, ఇవి ఒక దశలో కూడా ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని పేర్కొంది.
కిమ్ స్పష్టమైన సందేశం
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు KCNA నివేదించింది. తమ దేశ భద్రత కోసం అణ్వస్త్రాలు అవసరమని, వాటిని వదిలే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టంగా ప్రకటించినట్లు తెలిపింది. ప్రపంచ మేధావులు, విశ్లేషకులు ఈ పరిస్థితిని అణు ఉద్రిక్తతల దిశగా మళ్లించే ప్రమాదంగా భావిస్తున్నారు. క్వాడ్ స్టేట్మెంట్కు కిమ్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్తులో మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
Read Also : Rayachoti ‘Ugra’ Case: రాయచోటి ‘ఉగ్ర’ కేసు – సంచలన విషయాలు వెల్లడి