అన్నమయ్య జిల్లా రాయచోటి (Rayachoti) పట్టణంలో శాంతిని భంగం చేసే దిశగా సాగిన ఉగ్ర కుట్రను పోలీసులు సమర్థవంతంగా భగ్నం చేశారు. రెండు దశాబ్దాలుగా రాయచోటిలో అమానుల్లా, మన్సూర్ అనే పేర్లతో జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు నిజానికి ‘అల్ ఉమ్మా’ ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. విచారణలో శాంఘికంగా మెలిగినట్టుగా కనిపించినా, వారు అంతర్గతంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు గుర్తించారు.
దేశంలోని వివిధ నగరాల మ్యాప్స్
ఈ దాడిలో అధికారులు భారీ ఎత్తున ఉగ్ర సామగ్రి(Weapons of Mass Destruction)ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 IED (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) ల తయారీకి అవసరమైన వస్తువులు, తుపాకులు, బకెట్ బాంబులు, మారణాయుధాలు, సూట్కేస్ బాంబులు, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, కోడింగ్ బుక్స్, దేశంలోని వివిధ నగరాల మ్యాప్స్ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీటన్నింటినీ చూసినప్పుడు వారు దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న వారి సంబంధాలను కూడా గుర్తించి చర్యలు
పోలీసుల ప్రకటన ప్రకారం.. ఈ అరెస్టు రాష్ట్రంలో చాలా కీలకంగా భావించబడుతుంది. ఈ కేసు ఉగ్రవాదుల గూఢచర్యాన్ని తేలికగా పట్టుకోవడం కాదు, చాలా కాలంగా వారు ఎలా పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారో తెలుస్తోంది. వీరిపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న వారి సంబంధాలను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాయలసీమ ప్రాంతంలో ఉగ్రతత్వం పాయలు పరుస్తుందన్న ఆందోళనలకు దారితీసింది.
Read Also : Budget :16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదే – సీఎం రేవంత్