ఆగని హత్యలు యావత్ దేశాన్ని కుదిపివేస్తున్నాయి. వయసు బేధం లేకుండా పడనివారు ఎవరైనా సరే నిర్ధయగా చంపేసి హంతకులుగా మారుతున్నారు. హంతకుల్లో చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ ఉంటున్నారు. తాజాగా మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహజీవనం మరో యువతి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..
లివ్-ఇన్ సంస్కృతిలో పెరుగుతున్న హత్యలు
రాజధాని భోపాల్(Bhopal)లోని బజారియా (Bazaria)పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక యువకుడి ఇంట్లో మూడు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దొరికిన ఇంట్లోని యువకుడు మృతురాలి ప్రియుడు, లివ్-ఇన్ పార్టనర్ (Live-in partner) అని స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఆ అమ్మాయి అతనితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఒకే ఇంట్లో ఉంటుండగానే అతడు హత్యకు పాల్పడ్డాడు. తన ప్రియురాలిని చంపిన తర్వాత అతడు మృతదేహాన్ని బెడ్ షీట్లో చుట్టి పారిపోయాడు. సోమవారం రాత్రి హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హంతకుడు, మృతురాలి లివ్-ఇన్ పార్టనర్ అయిన సచిన్ రాజ్పుత్(Sachin Rajput)ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు అదుపులో – విచారణ కొనసాగుతోంది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సచిన్ రాజ్పుత్ మద్యం మత్తులో ఉండగా తన ప్రియురాలు రితిక(Ritika)ను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తన స్నేహితుల్లో ఒకరికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు భయపడిపోయాడు. వెంటనే హత్య గురించి బజారియా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహంపై పంచనామా చేసిన తర్వాత మార్చురీకి తరలించారు. రితిక హత్యకు పాల్పడిన లివ్-ఇన్ పార్టనర్ సచిన్ రాజ్పుత్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Read Also: Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు