ఆటో బస్ ఢీకొని ఇద్దరు మృతి- అతి వేగమే ప్రమాదానికి కారణం
Accident: ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెదక్ (Medak) మండలంలోని మొంబోజిపల్లి (Mombojipalli) వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొల్చారం మండలంలోని పోత శెట్టి పల్లికి చెందిన శ్రీకాంత్ (26), కౌడిపల్లి కి చెందిన నరేష్ ఆటో లో మెదక్ వస్తున్నారు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ (Srikanth) ముందుగా వెళ్తున్న బైక్ ని ఓవర్ టేక్ చేసేందుకు అతి వేగంగా వెళ్లడం తో ఆర్టీసీ బస్సు ను గమనించక దానికి డీ కొట్టడం జరిగింది. రెండు వాహనాలు వేగంగా ఉండటంతో ఆటో బస్ ని ఢీ కొని (Accident) నుజ్జు అయ్యింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీకాంత్ , నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajasekhar), ఎస్ ఐ లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ (Medak) ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read also: Patancheruvu: పటాన్చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి?