దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.18 గంటల సమయంలో నిఫ్టీ (Nifty)31 పాయింట్లు తగ్గి 25,606 వద్ద, సెన్సెక్స్ (Sensex)135 పాయింట్లు పతనమై 83,923 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్, జైడస్ వెల్నెస్, బీహెచ్ఈఎల్, జూపిటర్ లైఫ్లైన్ అత్యధిక లాభాల్లో ఉండగా.. జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా, కర్ణాటక బ్యాంక్, జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్, నారాయణ హృదయాలయ, కోరమండల్ ఇంటర్నేషనల్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ(BSE)లో టెక్, టెలికామ్ రంగ సూచీలు మినహా అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
లాభాల స్వీకరణ ప్రభావం
గత వారం సూచీలు 9 నెలల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు మందకొడిగా ట్రేడవుతున్నాయి. గాజా(Gaja)లో యుద్ధానికి కూడా ఈ వారం ట్రంప్ ముగింపు పలకొచ్చనే ప్రచారంతో పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు చిగురించాయి.
రంగాల వారీగా మార్కెట్ పరిస్థితి
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా నష్టపోయింది. శుక్రవారం రూ.85.47 వద్ద ముగియగా.. సోమవారం అది 85.48 వద్ద ట్రేడింగ్ను మొదలుపెట్టింది. ఆసియా-పసిఫిక్ ప్రధాన మార్కెట్ సూచీలు సానుకూలంగా ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఒక్క న్యూజిలాండ్కు చెందిన ఎన్జెడ్ఎక్స్ 50 మాత్రమే 0.12 శాతం నష్టాల్లో ఉంది.

చైనాకు చెందిన షాంఘై 0.2 (Shanghai), జపాన్ నిక్కీ (Japan Nikkei) 1.64, దక్షిణ కొరియా కోస్పీ 0.66, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ (Australia ASX) 0.46శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
గ్లోబల్ పరిస్థితులు & ప్రభావం
గాజాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగవుతాయనే అంచనాలతో మదుపుదారుల్లో నమ్మకం పెరుగుతోంది. శుక్రవారం రూపాయి విలువు ₹85.47 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ₹85.48 వద్ద ప్రారంభమైంది.
Read Also: Indigo Airlines : ఇండిగో విమానానికి ఇంజిన్ లో సమస్య