బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Ameerkhan) నటించిన ‘దంగల్'(Dangal) సినిమాను పాకిస్థాన్(Pakistan)లో విడుదల చేయకపోవడంపై ఆ దేశానికి చెందిన సీనియర్ మంత్రి ఇప్పుడు విచారం వ్యక్తం చేశారు. తాను దేశ సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సినిమాను నిషేధించడం తప్పని ఆమె అన్నారు. ఇందులో భారత జాతీయ గీతం, జెండా(Indian National song and flag) తొలగించాలని పాక్ సెన్సార్ సూచించడంతో ఆమిర్ ఖాన్ నిరాకరించారు. 2019 నుంచి పాకిస్థాన్ భారతీయ సినిమాలపై నిషేధం విధించింది.గతేడాది ప్రధాని షేక్ హసీనా(Shaik Haseena) నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్లో జరుగుతోన్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చైనా, పాకిస్థాన్ కలిసి కొత్తగా ఒక కూటమిగా..
చైనా, పాకిస్థాన్ కలిసి కొత్తగా ఒక కూటమిగా ఏర్పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరేలో చైనాలోని కున్మింగ్లో జూన్ 19న చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం తరువాత, ఈ మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కానీ, తాజాగా ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ తోసిపుచ్చింది.
భారత్ను పక్కన పెట్టే ఉద్దేశంతో..
దీనిపై బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం. తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. అది కేవలం అధికారుల స్థాయి సమావేశం మాత్రమేనని, రాజకీయ స్థాయి సమావేశం కాదని ఆయన అన్నారు. భారత్ను పక్కన పెట్టే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, “మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నది మాత్రం కాదు” అని అన్నారు.
పాక్కు అడ్డుకట్ట వేసేందుకు..
కానీ, ఈ విషయంపై చైనా, పాకిస్థాన్ వేర్వేరు ప్రకటనలు చేశాయి. మూడు దేశాల సహకారంపై చర్చించామని, పరస్పర నమ్మకం, సమానత్వం, అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించామని తెలిపాయి. అంతేకాకుండా, ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’గా ఏర్పడాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నాయి. అయితే, బంగ్లాదేశ్ మాత్రం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు గురించి తన ప్రకటనలో ప్రస్తావించలేదు. పాక్కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ ‘తుల్బుల్’ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి సిద్ధమవుతోన్న తరుణంలో కొత్త కూటమి తెరపైకి వచ్చింది.
బంగ్లాదేశ్పై భారత విధించిన వాణిజ్య ఆంక్షలు
ఈ పరిణామాలపై భారత్ స్పందించింది. నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ (MEA) గురువారం ప్రకటించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన ప్రయోజనాలు, భద్రతను ప్రభావితం చేసే పరిసర పరిణామాలపై మేము ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంటాం… ఒక్కో దేశంతో మన సంబంధాలు వాటి సొంత ప్రాధాన్యంతో ఉన్నా, పరిణామాలు, పరిస్తితులను దృష్టిలో ఉంచుకునేలా వాటిని మేము పరిగణిస్తాం’ అని చెప్పారు.
భద్రతా కారణాలతో భారత ప్రభుత్వం నిషేధం
‘‘ఈ నిర్ణయాలు బంగ్లాదేశ్ చర్యల ఆధారంగా తీసుకున్నవే. భారతదేశం ఎప్పటికప్పుడు ఈ సమస్యలను ప్రామాణిక చర్చల వేదికలపై, ముఖ్యంగా వాణిజ్య కార్యదర్శి స్థాయి సమావేశాల్లో కూడా ప్రస్తావించింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వాటి పరిష్కారం కోసం మేము ఎదురుచూస్తున్నాం,” అని తెలిపారు. భారత పత్తి, బియ్యం వంటి వస్తువుపైల ఆంక్షలు విధించిన తరువాత, భారత ప్రభుత్వం భద్రతా కారణాల నెపంతో నిషేధం అమలు చేసిందని చెప్పారు.