हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు

Sharanya
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు

Vijayawada: విజయవాడ (Vijayawada) నగరానికి పుణ్యభూమిగా పేరున్న ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ (Kanakadurgamma) ఆలయంలో వారాహి ఉత్సవాలు గురువారం నుండి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరిగే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) శ్రీ శీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మేళతాళాల, మంగళవాయిద్యాల నడుమ భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

సారె సమర్పణ: భక్తి, సంప్రదాయాల సమ్మేళనం

ఈ ఉత్సవాల్లో భాగంగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి శేష వస్త్రాలను అందజేశారు.

ఆషాఢ మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు

ఈ సంవత్సరం ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సారె సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు.

తెలంగాణ నుండి బంగారు బోనం – జూన్ 29న

ఈ నెల 29న అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 10 తేదీలలో శాఖాంబరి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

భక్తుల కోసం ఏర్పాట్లు – భద్రతా చర్యలు

ఈ నెల రోజుల ఉత్సవాల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉండటంతో, ఆలయ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు, నీటి పంపిణీ కేంద్రాలు, ప్రత్యేక క్యూ లైన్లు, మరియు మెడికల్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Read also: Cognizant: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870