ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు (Iran-Israel War) మళ్లీ ఉధృతం అయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులు జరుగుతుండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఇరాన్ మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి క్షిపణులతో దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ తమ యుద్ధవిమానాల ద్వారా ఇరాన్లోని రాడార్ వ్యవస్థలపై లక్ష్యసాధన దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.
ఇజ్రాయెల్ ప్రతిదాడులు నిలిపివేత
ఇజ్రాయెల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)హస్తక్షేపం చేశారు. ఆయన ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్ ద్వారా మాట్లాడి శాంతిని పాటించాలని సూచించినట్లు సమాచారం. ట్రంప్ సూచనల అనంతరం ఇజ్రాయెల్ తమ ప్రతిదాడులను నిలిపివేసినట్లు వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తమ యుద్ధ లక్ష్యాలు పూర్తయ్యాయని ఇజ్రాయెల్ పేర్కొనగా, ట్రంప్ ఇందుకు హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ఇరాన్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఇరాన్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలన మార్పు కావాలని అమెరికా ఆశించడం లేదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే, అది ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తుందని హెచ్చరించారు. అయితే, ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. మొత్తంగా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.