हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Ananthkumar Hegde: ముస్లిం కుటుంబంపై దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీపై కేసు

Ramya
Ananthkumar Hegde: ముస్లిం కుటుంబంపై దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీపై కేసు

అనంతకుమార్ హెగ్డేపై దాడి, కులదూషణల ఆరోపణలు – కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు

భాజపా మాజీ ఎంపీ, కర్ణాటక (Karnataka) నాయకుడు అనంతకుమార్ హెగ్డే (Ananthkumar Hegde) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ముస్లిం కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని బెదిరించిన ఘటనపై ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక వివాహ కార్యక్రమం ముగించుకొని తిరిగివస్తున్న సమయంలో మార్గమధ్యంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దాబస్‌పేట్ పోలీసులు హెగ్డేను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పలువురు మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హలేనహళ్లికి చెందిన సైఫ్‌ఖాన్ నిన్న తన కుటుంబంతో కలిసి తుమకూరులో ఓ వివాహ వేడుకకు హాజరై ఇన్నోవా క్రిస్టా కారులో తిరిగి వస్తున్నారు. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో నిజగల్ సమీపంలో తెలుపు రంగు ఎక్స్‌యూవీ 700 కారు ఒకటి వారి వాహనాన్ని అడ్డగించింది. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ‘నేను డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను’ అని అరుస్తూ తమ కారును రోడ్డు పక్కకు ఆపమని బలవంతం చేశారని సైఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కులదూషణలు, మౌఖిక దాడులు – కుటుంబాన్ని చంపుతామని బెదిరింపు

దాడి సమయంలో “సాబ్రు గ్రూప్ వాళ్లు.. కొట్టండి!” అంటూ హెగ్డేనే (Ananthkumar Hegde) మిగిలిన ఇద్దరికి ప్రోత్సాహం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. ‘సాబ్రు’ అనే పదం కర్ణాటకలో ముస్లిం సామాజిక వర్గాలను కించపరిచేందుకు ఉపయోగించే గ్రామ్య పదమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, “తక్కువ సాబ్రు కులం” అంటూ కులాన్ని దూషించే పదజాలాన్ని వాడారని ఎఫ్ఐఆర్‌లో నిక్షిప్తమైంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ తల్లి గుల్ ఉన్నీసా మెడ పట్టుకుని, బట్టలు లాగి, తలపై కొట్టి కింద పడేశారని కూడా ఆరోపణలొచ్చాయి. అలాగే, సైఫ్ మామ ఇలియాస్ ఖాన్‌ను కూడా హెగ్డే కొట్టి తీవ్ర గాయాలు చేయడం వల్ల ఆయన పళ్లు విరిగిపోయాయని తెలిపారు.

ఘటన సమయంలో హెగ్డే గన్‌మ్యాన్ తుపాకీ చూపిస్తూ కుటుంబాన్ని చంపుతామని బెదిరించినట్లు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను దాబస్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యుల సమక్షంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. హెగ్డేను ఏ1గా, ఆయన గన్‌మ్యాన్‌ను ఏ2గా, డ్రైవర్‌ను ఏ3గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

వివరాలు వెలుగులోకి – వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. వాటిని పరిశీలిస్తున్నామని, ఆధారాల ఆధారంగా మరింత స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. “దాడికి సంబంధించిన దృశ్యాలు మా దృష్టికి వచ్చాయి. వాటి ప్రామాణికతను పరిశీలించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని దాబస్‌పేట్ పోలీసులు తెలిపారు. వీడియో ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్ష్యాలున్న నేపథ్యంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ, “హెగ్డే కారును ఓ వాహనం ఓవర్‌టేక్ చేయడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత ఆయన గన్‌మ్యాన్, డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపి దాడికి పాల్పడ్డారు. అయితే, హెగ్డే స్వయంగా దాడి చేశారన్న విషయాన్ని పోలీసులు స్పష్టం చేయలేదు. విచారణ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Read also: Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ
1:48

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

📢 For Advertisement Booking: 98481 12870