ఇజ్రాయెల్ (Israel) చేసిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ సంఖ్యను సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. జూన్ 13 తర్వాత ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ దాడుల్లో కనీసం మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. ఆ వివరాలను ఇరాన్ (Iran) స్టేట్ మీడియా వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మీడియాపై ఆంక్షల కారణంగా హతమైయ్యిన వారి అసలు సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు.ఇరాన్లో పని చేస్తున్న మానవ హక్కుల సంస్థల ప్రకారం, ఇరాన్ వెల్లడించిన మృతుల సంఖ్య కంటే రెట్టింపు మరణాలు సంభవించి ఉండే అవకాశముంది. దాడుల తీవ్రతను బట్టి ఇది అంచనా వేయవచ్చు.
ఫోర్డో అణు కేంద్రంపై దాడి – ఐడీఎఫ్ వెల్లడి
ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దళాలు భారీ దాడి చేశాయి. ఫోర్డోకు వెళ్లే ప్రధాన మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. ఈ దాడుల్లో అమెరికా బీ2 బాంబర్ల సహకారం కూడా ఉందని సమాచారం.ఆదివారం తెల్లవారుజామున అమెరికా పంపిన బీ2 బాంబర్లు, బంకర్ బస్టర్ బాంబులతో న్యూక్లియర్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఫోర్డో కేంద్రం ప్రణాళికగా ధ్వంసమైందని అంటున్నారు.
గగనతలంలో విమానాల ఆంక్షలు – ప్రయాణాలకు ప్రభావం
ఇరాన్ గగనతలంలోకి ప్రస్తుతం ఎలాంటి కమర్షియల్ విమానాలు ప్రవేశించడం లేదు. అంతేకాకుండా, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్ గగనతలాన్ని కూడా విమానాలు తప్పించుకుంటున్నాయి.దుబాయ్ ఎయిర్పోర్టులో 120కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. జోర్డాన్లోని క్వీన్ అలియా విమానాశ్రయంలో 40 శాతం విమానాలు రద్దయ్యాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్ జూలై 3 వరకు దుబాయ్కి వెళ్లే విమానాలను నిలిపివేసింది. బ్రిటీష్ ఎయిర్వేస్ దుబాయ్, దోహా విమానాలను రద్దు చేసింది.
Read Also : Executions : ఇరాన్లో వరుస ఉరిశిక్షలు..!