అమెరికా (America) ఇటీవల ఇరాన్ (Iran) అణు కేంద్రాలపై నిర్వహించిన వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా (China) విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా స్పందన వచ్చింది. ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా అభివర్ణిస్తూ, తీవ్ర ఖండన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
“ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన”
“అమెరికా (America) తీసుకున్న ఈ చర్య ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్ నిర్దేశించిన లక్ష్యాలను, సూత్రాలను, అలాగే అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది” అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా ఏకపక్ష దాడులు ఆమోదయోగ్యం కావని చైనా స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్కు కాల్పుల విరమణ పిలుపు
వీలైనంత త్వరగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ కు చైనా పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, సంయమనం పాటించాలని ఇరు వర్గాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనా కోరింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడుల అనంతరం చైనా (China) నుంచి వెలువడిన తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.

“అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలి”
ప్రస్తుత భయంకర భౌగోళిక రాజకీయ వాతావరణంలో ప్రతి దేశం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, అంటోంది చైనా. దాడుల అనంతరం చైనా (China) నుండి వచ్చిన మొదటి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.
Read Also: Benjamin Netanyahu: “ఇది సుదీర్ఘ యుద్ధం కాదు”: నెతన్యాహు