పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ (Iran) పై తీవ్ర దాడులు కొనసాగిస్తుండగా, ఇరాన్ కూడా ఇక నిశ్శబ్దంగా ఉండకుండా ప్రత్యర్థి చర్యలకు దిగింది. ఈ దాడుల నడుమ ఇప్పటికే ప్రాంతం మొత్తం సన్నద్ధతలోకి వెళ్లిపోయింది.తాజా పరిస్థితుల్లో, అమెరికా కూడా ఈ వివాదంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉంది. వచ్చే రెండు వారాల్లో ఇరాన్పై సైనిక చర్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అయితే, అమెరికా జోక్యం పట్ల ప్రపంచ దేశాలు గట్టిగా స్పందిస్తున్నాయి. ఇది యుద్ధాన్ని మరింత ప్రమాదకర దిశగా తీసుకెళ్లొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.(Iran)
హౌతీల హెచ్చరిక: అమెరికా నౌకలు లక్ష్యంగా మారతాయ్
ఇరాన్కు మద్దతుగా నిలుస్తూ యెమెన్కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు (Houthi rebels) ఓ ఘాటైన హెచ్చరిక చేశారు. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా ఈ యుద్ధంలో దిగితే, ఎర్ర సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలే తమ లక్ష్యమవుతాయని ప్రకటించారు. హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సారీ మాట్లాడుతూ, అమెరికా జట్టుగా మారితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.
టెహ్రాన్ స్పందన: మేము సిద్ధంగా ఉన్నాం
ఇరాన్ ఇప్పటికే అమెరికా జోక్యం వల్ల పరిస్థితులు భయానకంగా మారతాయని స్పష్టం చేసింది. తమ భద్రత కోసం అవసరమైతే ఏ స్థాయిలోనైనా ప్రత్యర్థిని ఎదుర్కొంటామని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇప్పటికే హౌతీలు, హమాస్, హెజ్బుల్లా గుంపులు యాక్టివ్ అయ్యాయి. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగితే, ఈ యుద్ధం అంతర్జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పటికే క్షిపణుల స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా జోక్యం చేస్తే, ఇది పరిమిత యుద్ధంగా మిగలకుండా, పెద్ద మాంద్యం, ఆయిల్ ధరలు, శరణార్థుల వలయం వంటి సమస్యలకు దారితీయొచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : Brazil Hot Air Balloon : హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుని 8 మంది దుర్మరణం