हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Tanu: గొయ్యి తవ్వి కోడలిని పూడ్చి పెట్టి.. ఆపై లేచిపోయిందని ప్రచారం..

Shobha Rani
Tanu: గొయ్యి తవ్వి కోడలిని పూడ్చి పెట్టి.. ఆపై లేచిపోయిందని ప్రచారం..

హర్యానాలోని ఫరీదాబాద్‌(Faridabad)లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు కలిసి ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం చేశారు. రెండేళ్ల క్రితం వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధించడంతో ఏడాది పాటు సదరు వివాహిత పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొంత సొమ్ము ముట్టజెప్పి అత్తింట్లో దిగబెట్టగా.. అత్తింటి వారు ఈ ఘోరానికి పాల్పడ్డారు. మృతురాలి సోదరి ఫిర్యాదుతో రెండు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
రెండు నెలల తర్వాత వెలుగు చూసిన హత్య
ఈ ఘటనలో దారుణ హత్యకు గురైన వివాహిత ‘తనూ’ (Tanu) మృతదేహాన్ని శుక్రవారం గొయ్యిలో నుంచి పోలీసులు వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో హత్య జరిగి సుమారు రెండు నెలలకు పైనే అయి ఉంటుందని చెప్పారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి తను భర్త, అత్తమామలు, మరో దగ్గరి బంధువుతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనూ అత్తింటివారితో నివసించిన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు రెండు నెలల క్రితం మురుగునీటి కాలువ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
వివాహం తరువాత వెంటనే ప్రారంభమైన వేధింపులు
ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్‌కు, షికోహాబాద్ కు చెందిన తనూ(Tanu)కు సుమారు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొద్ది నెలలకే అత్తింట్లో తనూ(Tanu)కు వేధింపులు మొదలయ్యాయని ఆమె సోదరి ఆరోపించారు. తన సోదరిని అత్తింటివారు బంగారం, డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారని చెప్పారు. తమ కుటుంబం శక్తిమేర వారి డిమాండ్లను తీర్చినా, వేధింపులు ఆగలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. “వేధింపులు తాళలేక పెళ్లయిన కొద్ది నెలలకే తను మాతో పాటు పుట్టింట్లో ఏడాదికి పైగా ఉంది. చివరకు మళ్లీ అత్తింటికి పంపించాక, మళ్లీ చిత్రహింసలు మొదలయ్యాయి. మాతో ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవారు కాదు” అని ప్రీతి వాపోయారు.
ఏప్రిల్ 9న తనూ సోదరి ప్రీతి ఫోన్ కాల్
ఏప్రిల్ 9న తన సోదరికి ఫోన్ చేసినప్పుడు కలవకపోవడంతో అనుమానం వచ్చిందని, ఏప్రిల్ 23న అత్తింటివారు తనూ (Tanu)ఇంటి నుంచి పారిపోయిందని తమకు చెప్పారని ప్రీతి తెలిపారు. దీంతో పోలీసులను ఆశ్రయించినా, చాలా వారాల పాటు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పి

Tanu: ఫరీదాబాద్ లో ఘోరం..అదనపు కట్నం కోసం భార్య హత్య
Tanu: ఫరీదాబాద్ లో ఘోరం..అదనపు కట్నం కోసం భార్య హత్య

తనూ మామ ఏప్రిల్‌లో ఆ గొయ్యి తవ్వాడని, ఆ తర్వాత దాన్ని హడావుడిగా పూడ్చేసి, పైన సిమెంట్ స్లాబ్ వేశారని స్థానికులు ఇప్పుడు పోలీసులకు, విలేకరులకు తెలిపారు. “గొయ్యి తవ్వడం అందరం చూశాం. మురుగునీటి కోసమని చెప్పారు. ఆ తర్వాత కోడలు కనిపించలేదు. ఏదో తేడాగా ఉందని కొందరికి అనిపించినా, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు” అని తనూ పొరుగింటి వ్యక్తి చెప్పారు.
ప్రజల వ్యాకులం – ‘ఊహించలేని విషాదం’
“గొయ్యి తవ్వడం చూశాం, మురుగునీటి కోసమని చెప్పారు. తర్వాత తనూ (Tanu)కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది”.“ఇంత ఘోరం చేస్తారని కలలో కూడా ఊహించలేదు” అని పలువురు పొరుగువారు వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు పోలీసులపై చర్యలు ఆలస్యం చేశారన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. “మా ఫిర్యాదుల్ని చాలా వారాల పాటు పట్టించుకోలేదు” అని తనూ సోదరి ప్రీతి వాపోయారు.

Read Also: Woman Dies: కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం..గర్భిణీ మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతి విద్యార్థినిపై దాడి: హోంమంత్రి కఠిన స్పందన

తిరుపతి విద్యార్థినిపై దాడి: హోంమంత్రి కఠిన స్పందన

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

📢 For Advertisement Booking: 98481 12870