అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా (Air India) పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లండన్కి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం ఈ విషాదాన్ని మరింత తీవ్రమైంది.ఈ ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమాన సర్వీసులపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని పర్యాటక నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) అధ్యక్షుడు రవి గోసైన్ ప్రకారం, అంతర్జాతీయ రూట్లలో బుకింగ్లు 18 నుంచి 22 శాతం వరకు పడిపోయాయి. దేశీయ మార్గాల్లోనూ ఇది 10 నుంచి 12 శాతం మధ్య ఉండగా, మొత్తం మీద సుమారు 20 శాతం తగ్గుదల కనిపించిందన్నారు.
విమాన టికెట్ల ధరలు కూడా తగ్గుముఖం
బుకింగ్లు పడిపోవడంతో పాటు, టికెట్ల ధరలు (Ticket prices) కూడా గణనీయంగా తగ్గాయి. దేశీయ రూట్లలో టికెట్ల ధరలు 8 నుంచి 12 శాతం తగ్గాయని, యూరప్, ఆగ్నేయాసియా వంటి అంతర్జాతీయ రూట్లలో ఇది 10 నుంచి 15 శాతం వరకు ఉందని గోసైన్ వివరించారు. ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు సంస్థలు రాయితీలను అందిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారిలో చాలామంది తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రయాణికులు, అధిక శ్రేణి ప్రయాణదారులు ఇతర విమాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా 15–18 శాతం టికెట్ల రద్దు నమోదవుతున్నదీ, దేశీయంగా ఇది 8–10 శాతంగా ఉందని గోసైన్ తెలిపారు.
స్థితి తక్కువకాలానికే అని నిపుణుల ఆశ
ఈ ప్రభావం తాత్కాలికమేనని, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగితే మళ్లీ సాధారణ స్థితి వస్తుందనే నమ్మకం పర్యాటక రంగంలో ఉంది. ఫెయిత్ సంస్థ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, బుకింగ్లు 20 శాతం పడిపోయినా, ఇది గడచిపోతుందన్న నమ్మకముంది.
Read Also : Anil Kumar : నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్పై బదిలీ వేటు