ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను (Empowerment) కల్పించే భాష (language)అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్(Rahul Gandhi) అభిప్రాయపడ్డారు.

సమానత్వాన్నికోరుకోవడం లేదు
ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆ భాషను పేద పిల్లలు నేర్చుకోకుండా చేస్తోందని, ఎందుకంటే ప్రశ్నించడం వాళ్లకు ఇష్టం ఉండదని, సమానత్వాన్ని వాళ్లు కోరుకోవడం లేదని రాహుల్ అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో హిందీ భాషలో రాహుల్ గాంధీ ఇవాళ ఓ పోస్టు చేశారు. ఇంగ్లీష్ భాష ఆనకట్ట కాదు అని, అదో వారధి అన్నారు.
ప్రపంచంతో పోటీపడాలంటే
ఇంగ్లీష్ గొలుసు కాదు అని, అది గొలసుల్ని బ్రేక్ చేసే పరికరం అన్నారు. భారత దేశ పేద ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవద్దన్న ఆలోచనలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. మాతృభాష తరహాలోనే ఇంగ్లీష్ భాష ముఖ్యమైందని, ఎందుకంటే అది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. ప్రతి భారతీయ భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయని, వాటిని ఆదరించాలని, అదే సమయంలో ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పాలన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఇండియాకు ఇదో మార్గమని, ఇది ప్రతి పిల్లవాడికి సమాన అవకాశం కల్పిస్తుందన్నారు.
మాతృభాష మాట్లాడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా కీలక కామెంట్స్ చేశారు. భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. భారతీయ సంస్కృతిని కాపాడడంలో సాహిత్య పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిర్దేశించిన ‘పంచ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞల) గురించి కూడా ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇది చాలా ముఖ్యమని తెలిపారు. పరిపాలనా అధికారుల శిక్షణలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
Read Also:Uttar Pradesh: పెట్రోల్ బంక్లో ఓ సిబ్బంది పై గన్ తో బెదిరించిన