రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2025’ (Yogandhra 2025)కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో మాస్ యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) స్వయంగా హాజరుకానుండటంతో ఏర్పాట్లు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగాను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటన
ఈ భారీ కార్యక్రమం నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని పాఠశాలలకు జూన్ 20, 21 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అయితే ఇది పూర్తిస్థాయి సెలవు కాక, ఉదయం సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరై యోగా కార్యకలాపాలలో పాల్గొనాలి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు యోగాసనాలు చేసి, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా ఉంది.
యోగా ద్వారా ఆరోగ్యవంతమైన తరం
ఈ రెండు రోజులు స్కూళ్లలో యోగా శిక్షణ, ఆసనాలు నిర్వహించబడతాయి. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడతుందని ప్రభుత్వం నమ్ముతుంది. విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు మరియు ఆరోగ్యపరంగా బలమైన తరం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రధానమంత్రి పాల్గొనబోయే ఈ యోగాంధ్ర వేడుక రాష్ట్రం మొత్తానికే గౌరవాన్ని తీసుకురావడంతో పాటు, ప్రజలందరిలో యోగా పట్ల అవగాహనను మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read Also : Shashi Tharoor:ఆసీమ్ మునీర్కు ట్రంప్ విందు.. మండిపడ్డ శశిథరూర్