ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ సమయంలో అక్కడ ఉన్న భారతీయుల భద్రత ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’(Operation Sindhu) ను ప్రారంభించింది. యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే పనిలో ముమ్మరంగా ఉంది.ఈ మిషన్లో భాగంగా, ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియాకు చేరిన 110 మంది భారతీయ విద్యార్థులను (Indian students) భారత్కు తరలించారు. యెరవాన్ నుంచి ప్రత్యేక విమానంలో వీరంతా భారత్కి బయలుదేరారు. ఈ బృందం జూన్ 19న ఉదయం న్యూఢిల్లీకి చేరనుంది.
ఎంబసీ హెచ్చరికలతో అప్రమత్తం
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇంకా ఎంబసీని సంప్రదించని వారు వెంటనే దగ్గర సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరింది.విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో మోదీ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇది మరోసారి నిరూపితమైంది. క్లిష్ట పరిస్థితుల్లో తన పౌరుల్ని విడిచిపెట్టని ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోంది. ఈ చర్యలు దేశ భద్రతపై ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యతను చాటుతున్నాయి.
మిషన్ మోడ్లో పరిపాలన
విద్యార్థులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం సరిహద్దులు దాటి అర్మేనియాకు తీసుకెళ్లి, అక్కడి నుంచి విమానంలో భారత్కు పంపించారు. ఈ మొత్తం ప్రక్రియను మిషన్ మోడ్లో నిర్వహించారు.గత దశాబ్దంలో భారత విదేశాంగ విధానంలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. కేవలం దౌత్యమే కాక, అత్యవసర తరలింపులు కూడా తక్షణమే చేపడుతోంది. ‘దేశమే ప్రథమం’ అన్న సిద్ధాంతాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి దశలో అమలు చేస్తోంది.
Read Also : IndiGo : 40 నిమిషాల పాటూ విమానంలోనే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం : ఎందుకంటే?