కేంద్ర ఎన్నికల (Central Elections) సంఘం (ఈసీఐ) తాజా మార్గదర్శకాలను అనుసరించి, డబుల్ ఓట్లను (Bull votes) గుర్తించేందుకు కృషి సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల నమోదు లోపాలను దూరం చేయాలని ఈసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించామని సీఈఓ వెల్లడించారు. ఇలాంటి దాదాపు 58 వేల మంది వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం పంపించిందని చెప్పారు. ఈ జాబితాలోని వారిని సంప్రదించి, వారి సూచన మేరకు ఒక రాష్ట్రంలోని ఓటు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 30 వేల మంది పేర్లు తొలగించామని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు పరిమితి
ఇప్పటివరకు ఒక్కో బూత్లో 1500 మంది ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 1000కి పరిమితం చేయాలని ఈసీఐ నిర్ణయించిందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనుంది. ఇది ఓటర్లకు మరింత సౌలభ్యంగా ఉండేలా మారనుంది.ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సీఈఓ తెలిపారు. ఓటింగ్ సమయంలో మొబైల్ వాడకాన్ని నిరోధించడమే దీని వెనుక ఉద్దేశమన్నారు.
ఆధార్ అనుసంధానం బాధ్యతా కాకపోయినా ప్రోత్సాహం
వోటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, కానీ మరింత ఖచ్చితమైన డేటా కోసం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇది ఎన్నికల స్వచ్ఛతకు తోడ్పడుతుందని వివరించారు.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి విషయాన్ని అసెంబ్లీ గెజిట్ ద్వారా ఈసీఐకి పంపించామని చెప్పారు. అయితే ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు.
Read Also : Tet Exams : నేటి తెలంగాణ లో నుంచి టెట్ పరీక్షలు