हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bike taxi : కర్ణాటకలో నిలిపివేసిన బైక్‌ ట్యాక్సీ సేవలు

Sudha
Bike taxi : కర్ణాటకలో నిలిపివేసిన బైక్‌ ట్యాక్సీ సేవలు

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్‌ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్‌ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.

 Bike taxi : కర్ణాటకలో నిలిపివేసిన బైక్‌ ట్యాక్సీ సేవలు
Bike taxi : కర్ణాటకలో నిలిపివేసిన బైక్‌ ట్యాక్సీ సేవలు


హైకోర్టు ఆదేశం
కర్ణాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు సోమవారం, జూన్ 16, 2025 నుండి నిలిపివేయబడ్డాయి. ఇది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీ సేవలను నియంత్రించడానికి సరైన విధానాలు రూపొందించేవరకు, ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) వంటి సంస్థలు బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగించరాదని ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం, ఈ సంస్థలు తమ సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
హైకోర్టు ఆదేశానుసారం తాము బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేశామని ర్యాపిడో పేర్కొంది. అయితే సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ఉబర్‌ బైక్‌ ట్యాక్సీ సేవలను మోటో కొరియర్‌ కింద మార్చగా, ఓలా తన యాప్‌లో బైక్‌ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది. కాగా మోటార్‌ వెహికల్‌ చట్టంలో బైక్‌ ట్యాక్సీ అనే ప్రస్తావన లేకపోవడంతో ఆ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూన్‌ 15 వరకు గడువు ఇచ్చింది. బైక్‌ ట్యాక్సీ కంపెనీలు ఈ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయగా సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సమర్థించింది.
తదుపరి విచారణ
సోమవారం నుంచి బైక్‌ ట్యాక్సీ సేవలు నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో జూన్‌ 20 లోగా ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 24కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం బైక్‌ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. బైక్‌ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్‌వర్కర్ల జీవితాలు రోడ్డునపడతాయంటూ ‘నమ్మ బైక్‌ ట్యాక్సీ అసోసియేషన్‌’.. సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి లేఖలు రాసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరింది.
ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులు మరియు బైక్ ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు తమ రోజువారీ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు తమ జీవనోపాధి కోల్పోతున్నందున, వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read Also:Customer Care:పెరుగుతున్న కస్టమర్ కేర్ నంబరు మోసాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870