ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్కు వెళ్లనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 15 మరియు 16 తేదీల్లో సైప్రస్ దేశానికి అధికారిక పర్యటన చేయనున్నారు. ఇది భారత ప్రధానమంత్రి యొక్క సైప్రస్ దేశానికి జరిగిన తొలి పర్యటనగా గుర్తించబడింది. గడిచిన 20 సంవత్సరాలలో భారత ప్రధానమంత్రులు సైప్రస్ పర్యటించడం ఇది మొదటిసారి.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్తో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగానే ప్రధాని కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం క్రొయేషియాలో కూడా పర్యటించనున్నారు. మొత్తం ఐదు రోజులపాటు సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో మోదీ పర్యటన కొనసాగనుంది.
ఈ పర్యటన ప్రధానంగా భారతదేశం మరియు సైప్రస్ దేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విభాగాలలో మాతో సహకారం పెంచడం, అలాగే క్షేత్రస్థాయి సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం ప్లాన్ చేయబడింది. ప్రధాని మోదీ సైప్రస్ అధికారిక పర్యటనలో ప్రముఖ కార్యాలయలు మరియు సాంస్కృతిక కేంద్రాలను సందర్శించి, అక్కడి ప్రజలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.భారతీయ వ్యాపార వర్గాల ప్రతినిధులతో సైప్రస్ లో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ పర్యటన భారతదేశం మరియు సైప్రస్ మధ్య ఉన్న బంధాన్ని మరింత ప్రగాఢం చేస్తుంది.
Read Also:Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాల్లో