తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై (On Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని, అవి రేవంత్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో దాని ప్రభావం పెరిగింది. వీడియోలో ఉన్న మాటలు తీవ్రమైన అవమానంగా ఉన్నాయని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ విచారణ వేళ రెచ్చగొట్టే వ్యాఖ్యల ఉద్దేశం?
కాళేశ్వరం అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ను విచారణలో ప్రశ్నిస్తున్న ఈ సందర్భంలో, ఇలా మాట్లాడటం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉందని బాల్మూరి ఆరోపించారు.
సాక్ష్యాలతో సహా ఫిర్యాదు
ఫిర్యాదుకు బలం చేకూర్చేందుకు పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా సమర్పించారు. వీటిలో వీడియో క్లిప్స్తో పాటు కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉన్నట్లు సమాచారం.
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు
పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా కేటీఆర్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 353(2), 352 కింద కేసు నమోదు చేశారు.
ప్రజా శాంతికి భంగం కలిగించే వ్యాఖ్యలపై కఠిన చర్య
ఈ సెక్షన్ల ప్రకారం ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం నేరంగా మారుతుంది. కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఈ శ్రేణిలోకే వస్తాయని పోలీసులు అభిప్రాయపడ్డారు.ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం మొదలయ్యే అవకాశముంది. కేసు ఎలా ముందుకెళ్తుందన్న దానిపై అందరి దృష్టి ఉంది.
Read Also : Tamil Nadu : తమిళనాడులో కీలక బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదం