అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్కు బయలుదేరిన విమానం కుప్పకూలింది. ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.విమానంలో లోపం ఉందని ఓ ప్రయాణికుడు ముందే హెచ్చరించారు. ఆకాష్ అనే ప్రయాణికుడు ఈ విషయం ఎయిర్ ఇండియాకు చెప్పారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విమానంలో తాను ఏదో తేడా గమనించానని ఆకాష్ (Akash) అన్నారు. న్యూఢిల్లీలో విమానంలో ఎక్కి అహ్మదాబాద్లో దిగారు. దిగిన వెంటనే ఎయిర్ ఇండియాకు లోపాన్ని సమాచారం ఇచ్చారట.
విమానంలో పాత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది
ఇది మొదటి సారి కాదని ఇప్పుడు సమాచారం బయటకు వస్తోంది. ఇదే విమానంలో గత ఏడాది రెండు సార్లు సమస్యలు వచ్చాయి. 2024 జూన్ 6, డిసెంబర్లో ఈ విమానంలో సాంకేతిక లోపాలు వచ్చాయి.ఈ లోపాలపై డీజీసీఏ సంస్థ ఎయిర్ ఇండియాకు లేఖ రాసింది. కానీ ఎయిర్ ఇండియా సంస్థ స్పందించలేదు. నిర్లక్ష్యంతో వ్యవహరించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడే మూడో ప్రమాదం
ఇది మూడోసారి అదే విమానం ప్రమాదానికి గురైంది. గతంలోని హెచ్చరికల్ని ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. ఫలితంగా ఈసారి ప్రాణాలు పోయాయి.
ప్రజల్లో ఆందోళన
ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళన సృష్టించింది. ప్రయాణికుల భద్రతపై భారీగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.విమాన భద్రతపై కేంద్రం వెంటనే స్పందించాలి. బాధ్యత వహించే అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రాణాల విలువ గుర్తించాలి.