అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) భద్రతా విధుల్లో పాల్గొనడానికి వెళ్లుతున్న జవాన్లకు (Soldiers)నాణ్యతలేని, అధ్వాన స్థితిలో ఉన్న రైలు కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “దేశ భద్రత కోసం ప్రాణాలు పెడుతున్న జవాన్లకు కనీస గౌరవం ఇవ్వని ప్రభుత్వం ఎలా దేశభక్తిని మాట్లాడుతుంది?” అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.
మోదీ ఖరీదైన ప్రత్యేక విమానాల్లో – జవాన్లు తుప్పు పట్టిన విమానాల్లో
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖరీదైన ప్రత్యేక విమానాల్లో దేశం మొత్తం తిరుగుతున్నారు. అదే సమయంలో, దేశాన్ని కాపాడే సైనికులను తుప్పు పట్టిన, పాతబడి ఉన్న రైళ్లలో ప్రయాణించాల్సిందిగా చేయడం దారుణం,” అని వ్యాఖ్యానించారు. ఇది జవాన్లకు తక్కువగా చూసే ధోరణిని ప్రతిబింబిస్తుందంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రైల్వే మంత్రి అశ్వినీ సీరియస్
ఇక ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఘటనను సీరియస్గా తీసుకున్నట్లు వెల్లడించారు. తప్పు జరిగిన విషయాన్ని అంగీకరించిన ఆయన, బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అలాగే, జవాన్లకు ప్రత్యామ్నాయంగా మరొక ప్రత్యేక రైలు కేటాయించినట్లు కూడా తెలిపారు. అయినప్పటికీ, ఈ ఘటనపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు మోదీ ప్రభుత్వానికి నిదానించని అసంతృప్తిని సూచిస్తున్నాయి.
REAL videos of REELways
Video source- Viral
Facts verified
This was the condition of the train that #IndianRailways had initially assigned for our 1200 #BSF jawans deployed for Amarnath Yatra security. The journey was for more than 26 hours from Udaipur to Jammu. Our Jawans… pic.twitter.com/MINd0ucllq— Tamal Saha (@Tamal0401) June 11, 2025