తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి(Development of Irrigation Projects)కి ప్రభుత్వం కృషి చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) తెలిపారు. శ్రీశైలం ఎడమ నదీ తీరం కాల్వ (SLBC) టన్నెల్ పనులు ఎంతో కాలంగా నిలిచిపోయిన నేపథ్యంలో, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ టన్నెల్ పూర్తి కావడం ద్వారా రాష్ట్రంలో లక్షల ఎకరాల భూమికి నీరందే అవకాశముందన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ సహకారం
SLBC టన్నెల్ పనులను వేగవంతం చేయడంలో రక్షణ మంత్రిత్వ శాఖ సహకారం కీలకమవుతుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ టన్నెల్ కొన్ని ప్రదేశాల్లో ఆర్మీ నియంత్రణలో ఉండే ప్రాంతాల గుండా వెళ్లడం వల్ల, డిఫెన్స్ మినిస్ట్రీ సహకారం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే రక్షణ శాఖ ఈ పనులకు అనుమతి ఇచ్చిందని, ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తమ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్ర పరిధి
ఈ టన్నెల్ ప్రాంతం శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోకి వస్తుందన్న కారణంగా, టన్నెల్ పరిస్థితిని అంచనా వేయడానికి హెలికాప్టర్ ద్వారా సర్వే చేయనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెచ్చే ఎలక్ట్రో మాగ్నటిక్ డివైజ్లతో భూభాగాన్ని పరీక్షించి టన్నెల్ లోపల పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also : Raja Singh : కిషన్ రెడ్డి అంశంపై మోడీకి ఫిర్యాదు చేయొచ్చు కదా అన్న రాజాసింగ్