ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రోజు కొత్త కొత్త మాయజాలాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు వారి దృష్టి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులపై పడింది. అమాయకులకు నకిలీ సందేశాలు పంపిస్తూ వారికి భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.మీ KYC నిలిపివేశారు… 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుంది. అనే సందేశాలు కొందరికి అందుతున్నాయి. టెలికాం రెగ్యులేటరీ (Telecom Regulatory) అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తరపున వచ్చినట్టు కనిపించే ఈ సందేశాలు పూర్తిగా నకిలీవని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల్లో భయం కలిగించి, వారి వ్యక్తిగత సమాచారం దొంగలించాలన్నదే ఈ మోసగాళ్ల అసలైన ఉద్దేశం.ఈ సందేశంలో మీరు సమస్యను పరిష్కరించాలంటే ఒక నిర్దిష్ట నంబర్కు కాల్ చేయాలని సూచన ఉంటుంది. వినియోగదారులు ఆ నంబర్కు కాల్ చేస్తే, వారు అడిగే వివరాలు అడుగడుగునా పంపిస్తారు. ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు ఇలా చెప్పించుకుంటూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
ఈ మోసపూరిత చర్యలపై కేంద్రం తక్షణమే స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై స్పష్టత ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ పేరుతో వచ్చే ఈ సందేశం అసలే నమ్మకంగా ఉండదని, ఇది పూర్తిగా నకిలీదని ఖరారు చేసింది.బీఎస్ఎన్ఎల్ సంస్థ సిమ్ KYC కారణంగా ఎప్పుడూ వినియోగదారులకు SMS ద్వారా నోటీసులు పంపించదని అధికారులు చెప్పారు. దీంతోపాటు, ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఇచ్చిన సూచన ప్రకారం, ఎటువంటి సందేశమైనా ముందుగా దాని నిజాయితీని పరిశీలించాలి. అధికారిక వెబ్సైట్లు లేదా సంస్థల కస్టమర్ కేర్ ద్వారా ధృవీకరించకుండా ఏదీ నమ్మవద్దు. అలాగే, అనుమానాస్పద లింకులు, ఫోన్ నంబర్లు ఉంటే వెంటనే దూరంగా ఉండాలి.
ఎలాంటి సందేహం ఉన్నా అధికారులను సంప్రదించండి
మీ ఫోన్కు నకిలీ సందేశం వచ్చినట్టయితే, ఆపై ఉన్న లింకులపై క్లిక్ చేయకండి. ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి. అవసరమైతే, బీఎస్ఎన్ఎల్ అధికారిక కస్టమర్ కేర్ను సంప్రదించండి. ఎప్పుడూ సురక్షితంగా ఉండటమే పరిష్కారం.
మోసగాళ్లపై ప్రజల్లో అవగాహన పెరగాలి
ఇలాంటి మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఈ మోసాలకు ప్రధాన కారణం. కనుక ప్రతి ఒక్కరు దీన్ని గమనించి, తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలి. సమాచారాన్ని తేలిగ్గా నమ్మకూడదు, ప్రతి విషయాన్ని పరీక్షించాలి.ఈ మోసాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే మన డేటా, డబ్బు భద్రంగా ఉంటాయి. ఒక మెసేజ్ ద్వారా కలిగే భయంతో విలువైన సమాచారాన్ని వదలవద్దు. తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించాలి.
Read Also : Aloe vera: అలోవెరా లో అరవై ఔషధ గుణాలు