ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)3.0 ప్రభుత్వానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం (Oath taking)చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్ భారత్కా అమృత్ కాల్’ (‘Vikasit Bharatka Amrit Kal’)అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

PM Modi: నమో ప్రభుత్వానికి 11 ఏళ్లు.. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. ప్రధాని సంచలన ట్వీట్
సమగ్ర పురోగతిపై దృష్టి
సుపరిపాలన, అభివృద్ధిపై NDA సర్కార్ దృష్టిపెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 11 ఏళ్లలో విభిన్న రంగాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్.. మా ఎన్డీఏ సూత్రం.. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల సమగ్ర పురోగతిపై దృష్టి సారించామని తెలిపారు. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. వికసిత్ భారత్ నిర్మాణానికి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు #11YearsOfSeva హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.
పూర్తి అంకితభావం
గత 11 సంవత్సరాలలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం పేదల సంక్షేమాన్ని నిర్ధారించడంపై దృష్టి పెట్టిందని మోదీ పేర్కొన్నారు. ఉజ్వల లేదా ప్రధానమంత్రి ఆవాస్, ఆయుష్మాన్ భారత్ లేదా భారతీయ జనౌషధి లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అయినా, ఈ పథకాలన్నీ దేశప్రజల ఆశలను నెరవేర్చాయన్నారు. ఈ సమయంలో, పూర్తి అంకితభావం, సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేసామని మోదీ తెలిపారు. గత పదకొండు సంవత్సరాలుగా అనేక సానుకూల మార్పులు వచ్చాయని.. ఇవి ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచాయని మోదీ పేర్కొన్నారు. నమో యాప్ ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో మిమ్మల్ని ఇంటరాక్టివ్ గేమ్లు, క్విజ్లు, సర్వేలు, సమాచారం, నిమగ్నం, స్ఫూర్తినిచ్చే ఇతర ఫార్మాట్ల ద్వారా వినూత్న పద్ధతిలో తీసుకెళుతుందని వివరించారు. సుపరిపాలన – పరివర్తనపై స్పష్టమైన దృష్టి ని కేంద్రీకరించామని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు.. సమిష్టి భాగస్వామ్యంతో, భారతదేశం విభిన్న రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని మోదీ పేర్కొన్నారు.
Read Also:ASP: ఐఈడి పేల్చిన మావోయిస్టు: కుంట ఏఎస్పీ అకాష్ గిర్పుంజే మృతి