ఉత్తర మలేసియాలో (Malaysia) ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఓ దారుణ రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపింది. విద్యార్థులతో నిండి ఉన్న ఒక బస్సు అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న మినీవ్యాన్ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటన థాయ్లాండ్ సరిహద్దుకు సమీపంగా ఉన్న గెరిక్ పట్టణం, ఈస్ట్-వెస్ట్ హైవే వద్ద చోటుచేసుకుంది.

మృతులలో 14 మంది విద్యార్థులే:
మలేసియాలో గత పదేళ్లలో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదమని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులేనని చెప్పారు. మరో వ్యక్తి బస్సు అటెండెంట్గా గుర్తించారు.
ప్రమాద వివరాలు:
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, బస్సు పూర్తిగా అదుపుతప్పి మినీవ్యాన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆకుపచ్చ రంగు బస్సు కుడివైపునకు బోల్తాపడి వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, ఎరుపు రంగు మినీవ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. “కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా, మరికొందరు బయటకు విసిరివేయబడ్డారు. ఇంకొందరు బస్సులోనే చిక్కుకుపోయారు” అని చెప్పారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు హైడ్రాలిక్ కట్టర్ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు.
గాయపడిన వారిలో 7 మంది పరిస్థితి విషమం:
ప్రమాదంలో గాయపడిన 33 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రులలో వైద్యులు వారిని చికిత్సలో ఉంచారు. మిగిలిన 26 మందికి మైనర్ గాయాలే అయ్యాయని సమాచారం.
మలేసియా ప్రభుత్వ స్పందన:
ఈ ఘటనపై మలేసియా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తక్షణమే అధికారిక దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈశాన్య మలేసియాలోని జెర్తే పట్టణం నుంచి నిన్న వీరు బయలుదేరగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
విద్యార్థుల కుటుంబాల్లో విషాదం:
ప్రమాద సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు క్షణాల్లోనే దిగ్భ్రాంతికి లోనయ్యారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా తమ విద్యార్థులను కోల్పోయిన విషాదంలో మునిగిపోయింది. దిగ్బంధన ప్రకటించి, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయంగా నిలబడతామని హామీ ఇచ్చారు.
Read also: Trump : విమానం ఎక్కుతూ పడిపోబోయిన డోనాల్డ్ ట్రంప్