భారతీయ మధ్యతరగతి వర్గాల మెచ్చిన మోడల్, సుజుకి స్విఫ్ట్ కారు (Suzuki Swift car) తయారీని తాత్కాలికంగా నిలిపివేయాలని మారుతీ సుజుకి (Maruti Suzuki) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది స్విఫ్ట్ ప్రేమికులకు పెద్ద షాక్గా మారింది. ఎందుకంటే ఈ మోడల్ను ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్నారు.ఈ నిర్ణయానికి వెనుక పలు కారణాలున్నాయి. ముఖ్యంగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో భారత్లో ఆటోమొబైల్ తయారీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎలక్ట్రిక్ మోటార్స్, ఇతర కీలక భాగాల తయారీకి అవసరమైన మాగ్నెట్ మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సంస్థ నిర్ణయం తీసుకుంది.
తాత్కాలికంగా ఆగిన ఉత్పత్తి
మారుతీ సుజుకి ఇప్పటికే మార్చి 26 నుంచి జూన్ 6 వరకు స్విఫ్ట్ తయారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే స్పోర్ట్ వెర్షన్ మాత్రం ఈ పరిమితికి లోబడదు. తాజా ప్రకటనలో జూన్ 13 నుంచి ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది. పూర్తి స్థాయి ఉత్పత్తి జూన్ 16 నుంచి కొనసాగుతుందని స్పష్టం చేసింది.
పర్యావరణంపై దృష్టి
ఇక గ్లోబల్ స్థాయిలో పర్యావరణంపై పెరిగిన అవగాహనతో ప్రజలు, ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలో మారుతీ సుజుకి కూడా గ్రీన్ మొబిలిటీ వైపు దృష్టి సారించనుంది. ఫ్యూచర్ మోడళ్ల రూపకల్పనలో ఈ మార్పులు కీలకంగా నిలవనున్నాయి.
ఇంకా భయపడాల్సిన పని లేదు
ఇప్పటికైతే విడిభాగాల అందుబాటులో ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా తాత్కాలిక చర్య మాత్రమేనని పేర్కొంది. స్విఫ్ట్ కారు మళ్లీ ఉత్పత్తిలోకి వస్తుందని సంస్థ అధికారికంగా తెలియజేసింది.
Read Also : Jogi Ramesh : అమరావతి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్న జోగి రమేశ్