ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతిలో (Amaravati) విశ్వవ్యాప్త టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు ఇటీవల విశ్వసనీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం రాష్ట్రానికి అభివృద్ధి సంకేతంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గూగుల్ (Google) ప్రతినిధులు పలుమార్లు సమావేశమై ఉన్నత స్థాయి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇది ఏపీ పాలకులకు గర్వకారణమే కాక, రాజధాని ప్రాంత అభివృద్ధికి బలమైన మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

అమరావతిని ఎందుకు ఎంచుకుంటోంది గూగుల్?
గూగుల్ సంస్థ చేపట్టబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అమరావతిని వేదికగా చేసుకోవాలని ఎందుకు యోచిస్తోందన్నది గమనించవలసిన విషయం. కొన్ని ప్రధాన కారణాలు ఇవే
AP CRDA చురుకైన సమన్వయం
గూగుల్ ప్రతినిధుల బృందం, ఏపీ సీఆర్డీఏ (CRDA) (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అధికారులతో కలిసి శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. తుళ్లూరు మండలంలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల మధ్య ఉన్న ఈ-8 రహదారికి సమీపంలో ఉన్న భూములను వారు పరిశీలించారు.
సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16 పరిధిలోని సుమారు 143 ఎకరాల విశాలమైన భూమిని గూగుల్ ప్రాజెక్టు కోసం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సంకేతిక మౌలిక సదుపాయాల ప్రాధాన్యత
ఇప్పటి వరకు గూగుల్ ఏ పద్ధతిలో ప్రాజెక్టును అమలుచేయబోతోందనేది అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అనధికార సమాచారం ప్రకారం,
గూగుల్ ప్రతినిధులు పరిశీలించిన ఈ స్థలానికి పలు అనుకూలతలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా, భవిష్యత్తులో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రైల్వేస్టేషన్ ఈ ప్రాంతానికి దగ్గరగా రానున్నాయి. ఈ రవాణా సౌకర్యాల సామీప్యత కారణంగానే గూగుల్ ప్రతినిధులు ఈ నిర్దిష్ట స్థలం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ అంశాలన్నీ గూగుల్ తమ ప్రాజెక్టును ఇక్కడ స్థాపించడానికి సానుకూలంగా దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.