బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సాధారణ ఎన్నికల(Bangladesh Elections)పై చివరికి అధికారిక ప్రకటన వెలువడింది. 2026 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ (Muhammad Yunus) ప్రకటించారు. ఇటీవల రాజకీయంగా ఆ దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాత్కాలిక ప్రధానిగా యూనస్ బాధ్యతలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయిన తర్వాత, తాత్కాలిక ప్రధానిగా యూనస్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పాలన పట్ల ప్రజల్లో విశ్వాసం అంతగా లేకపోవడంతో, త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్లు విపక్షాల నుంచే కాకుండా సాధారణ ప్రజల నుంచీ పెరిగాయి. ఈ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని యూనస్ అధికారికంగా ఎన్నికల తేదీని వెల్లడించారు.
వేడెక్కిన బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం
ఎన్నికల ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం వేడెక్కనుందని అంచనా. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పునరుజ్జీవానికి కీలక ఘట్టంగా మారనున్నాయి. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకునే అవకాశం పొందనున్న ఈ సమయం, బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.
Read Also : Chandrababu Naidu : చంద్రబాబుతో నీతి ఆయోగ్ భేటీ