పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), మరోసారి వార్తల్లోకెక్కారు.ఈసారి, దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ మీద సీరియస్ ఆరోపణలు చేశారు.ఇమ్రాన్ ఖాన్ ప్రకారం, తన భార్య బుష్రా బీబీపై కేసులు వేయడం వెనుక మునీర్ (Munir) ఉన్నారు.ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన ప్రతీకారమే ఇది, అన్నారు.ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్, తనపై జరుగుతున్న వివక్షను బయటపెట్టారు.తన కుటుంబం, పార్టీ శ్రేణులపై అన్యాయంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు.నా భార్యను కలవాలనుకున్నారు.
ఇమ్రాన్ వివరించగా
ప్రధానిగా ఉన్నప్పుడు మునీర్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించా.ఆ తర్వాత, ఆయన బుష్రా బీబీని కలవాలన్నా, ఆమె తిరస్కరించారు.ఈ దానికి ప్రతీకారంగా, 14 నెలల శిక్ష వేయించారని ఆయన ఆరోపించారు.జైల్లో ఆమెపై అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు అన్నారు.బుష్రా బీబీ రాజకీయంగా ఏమీ చేయలేదు అని ఖాన్ చెప్పారు.కానీ, ఆమెపై అనేక కేసులు పెట్టారని వాపోయారు.గత నెల రోజులుగా, ఆమెను కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు, అన్నారు.నియంతృత్వ పాలనలోనూ ఇటువంటి దౌర్జన్యం జరగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.లండన్ ప్లాన్ లో భాగమేనా మే 9 హింస?
ఇంతటితో ఆగలేదు ఇమ్రాన్.
2023 మే 9న జరిగిన హింసా ఘటనలపై కూడా బాంబ్ వేసారు.అదంతా ఒక లండన్ ప్లాన్ ప్రకారం జరిగింది, అన్నారు.నన్ను, నా పార్టీని అణచివేసేందుకు రాజకీయం నడుస్తోంది, అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే కుట్రలు?
ఇమ్రాన్ ఖాన్ చివరగా పెద్ద ప్రశ్నను సంధించారు.ఇది ప్రజాస్వామ్యం కాదే. ఇది ప్రతీకారం తప్ప మరేం కాదు! అన్నారు.ఆర్మీ చీఫ్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల, కేసు మరింత మలుపులు తీయనుంది.
Read Also : Sharmistha Panoli : శర్మిష్ఠ అరెస్టు తర్వాత పరారీలో వజాహత్ ఖాన్..