हिन्दी | Epaper

Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్​ పాయిజన్​.. ఒకరు మృతి!

Sudheer
Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్​ పాయిజన్​.. ఒకరు మృతి!

హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్యశాఖ ఆసుపత్రి(Erragadda Hospital)లో ఫుడ్ పాయిజన్ కేసు (Food Poisoning Case) తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసిక రోగులకు సరఫరా చేసిన ఆహారం కారణంగా, ఒక్కసారిగా అనేక మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మందికి పైగా రోగులు వాంతులు, పేగుల నొప్పులు, తల తిరుగుడు వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రి లోపలే ఐసోలేషన్ వార్డుల‌కు తరలించబడినట్లు సమాచారం.

మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది

అస్వస్థతకు గురైన రోగులకు వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుడి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, ఫుడ్ సప్లై కాన్ట్రాక్టర్లపై దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం

ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించాలని పలువురు ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.

Read Also : ABV:శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

📢 For Advertisement Booking: 98481 12870