ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర స్ధాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ముగింపు పడింది. దీనిపై తాజాగా రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (AnaganiSatyaPrasad) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన వైసీపీ పాలనను “రాక్షస పాలన”గా అభివర్ణించారు. ప్రజలపై తీవ్రంగా దాడులు, అక్రమ అరెస్టులు, అభివృద్ధి కార్యక్రమాల గ్యాప్, రైతుల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ, వైసీపీ పాలన సామాన్య ప్రజానీకానికి పీడగా మారిందని అన్నారు.
జూన్ 4 – చరిత్రలో ఒక మలుపు
జూన్ 4, 2024న వెలువడిన ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను మార్చాయి. గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మోసానికి జగన్ నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, కానీ అందుకు భిన్నంగా ‘వెన్నుపోటు దినం’ అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని అనగాని ఎద్దేవా చేశారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు ‘పశ్చాత్తాప దినం’గా జరుపుకోవాలని ఆయన హితవు పలికారు.
కూటమి పాలన – ప్రజల ఆకాంక్షల దిశగా అడుగులు
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే వారికి అలవాటైన రీతిలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
జగన్ పై తీవ్ర విమర్శలు
జగన్ వ్యక్తిగతంగా కూడా విశ్వసనీయత కోల్పోయారని అనగాని అన్నారు. తల్లికి, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న జగన్ను ప్రజలు ఎలా విశ్వసిస్తారని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆయన ఇదే రకమైన వైఖరితో ముందుకు సాగితే, రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారి, చివరికి సున్నాకు చేరుకుంటుందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే వైసీపీని చాలామంది నేతలు వదిలి వెళ్తున్నారనీ, నమ్మకానికి చోటు లేకుండా పోయిందని స్పష్టం చేశారు.
Read also: Andhra: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు బార్సిల్ సంస్థకు అప్పగింత