గల్ఫ్ (Gulf) దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించిన పది మంది నేపాలీయులు ఇటీవల ముంబై విమానాశ్రయంలో పది మంది అరెస్టయ్యారు. నకిలీ పత్రాలతో ప్రయాణించేందుకు ప్రయత్నించిన వీరు, భారీ ఇమ్మిగ్రేషన్ (Illegal Immigration) మోసానికి పాల్పడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు.అధికారుల కథనం ప్రకారం, ఈ పది మందీ నేపాల్ సరిహద్దు (Nepal border) దాటేందుకు చట్టబద్ధ మార్గాలను వదిలేసి, బీహార్ ప్రాంతం మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు. అనంతరం పాట్నా నుంచి విమానంలో ముంబై చేరుకున్నారు. అక్కడి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లాలన్నది వారి ప్లాన్.ఈ వ్యక్తులు తమ దేశంలోని ట్రావెల్ ఏజెంట్లకు రూ.2.5 లక్షలు చొప్పున చెల్లించారు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు అందుకుని, ప్రయాణ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. వీరిలో ఇద్దరికి నకిలీ ఆధారాలపై భారతీయ పాస్పోర్టులే వచ్చాయి.
దోహా, యూఏఈకి ఉద్యోగాల పేరుతో ప్రయాణ ప్రయత్నం
మే 26న ఆరుగురు నేపాలీయులు ముంబై ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నారు. ఉద్యోగాల కోసం దోహా, యూఏఈకి వెళ్తున్నామని చెబుతూ ప్రయాణించేందుకు ప్రయత్నించారు. వారి పత్రాల్లో అనుమానాస్పద విషయాలు కనిపించడంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల్లో మరో నలుగురు కూడా ఇలాగే పట్టుబడ్డారు.
రాయబార కార్యాలయం పేరుతో నకిలీ పత్రాలు
ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన విచారణలో ఓ కీలక విషయం వెలుగుచూసింది. నకిలీ విదేశీ ఉపాధి అనుమతి పత్రాలను నేపాల్ రాయబార కార్యాలయం పేరుతో తయారు చేశారు. ఈ పత్రాలతోనే వారు ఉద్యోగాల కోసం వెళ్తున్నట్టు చెబుతూ అధికారులు మోసగించారు.
డంకీ రూట్ వెనుక పెద్ద ముఠా
ఈ వ్యవహారంలో నేపాల్కు చెందిన ఏజెంట్లు, భారతీయ సహకారులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బీహార్-నేపాల్ సరిహద్దులోని ఏడు జిల్లాల (పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి, మధుబని, సుపాల్, అరారియా, కిషన్గంజ్) ప్రాంతాల నుంచి వీరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని తెలిసింది.నేపాలీయులకు చట్టబద్ధంగా భారత్లోకి వచ్చే మార్గాలు ఉన్నా, డంకీ రూట్ ఎందుకు ఎంచుకున్నారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మళ్లీ ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు.
Read Also : Bike accident : బైక్ ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు