ఈశాన్య భారతంలో వర్షాలు (Rains ) తీవ్రమయ్యాయి. ముఖ్యంగా నార్త్ సిక్కిం ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్యాటకుల (Tourists) పరిస్థితి విషమంగా మారింది. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, సుమారు 1,500 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, ప్రధాన రహదారులపై గస్తులు బందయ్యాయి. దీంతో ప్రయాణాలు నిలిచిపోయాయి.
కొండచరియలు కూలిపోవడం, మట్టితో కూడిన నీరు నిలిచిపోవడం
ఇందులో లాచుంగ్లో 1,350 మంది, లాచెన్లో 115 మంది పర్యాటకులు ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు. రహదారులపై కొండచరియలు కూలిపోవడం, మట్టితో కూడిన నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక సిబ్బంది, యుద్ధ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో సహాయం అందించడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.
పర్యాటకులకు అధికారులు కీలక హెచ్చరిక
పర్యాటకుల భద్రత దృష్టిలో పెట్టుకొని, అధికారులు వారిని హోటళ్లలోనే ఉండాలని, వర్షాలు తగ్గేవరకు బయటకు రావొద్దని సూచించారు. అవసరమైన ఆహారం, నీరు, వైద్యం వంటి సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వర్షాల తీవ్రత తగ్గిన అనంతరం రహదారుల క్లీన్అప్కు అధికారులు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. పరిస్థితి పై కేంద్రం కూడా నిఘా పెట్టిందని తెలుస్తోంది.
Read Also : Gamblers Movie: గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ విడుదల