हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Greenfield Highway : తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే

Sudheer
Greenfield Highway : తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే

తెలంగాణ(Telangana )లో మళ్లీ ఒక ప్రధాన హైవే విస్తరణకు అనుమతులు లభించాయి. నిజామాబాద్‌-జగదల్‌పూర్ జాతీయ రహదారి (NH-63) విస్తరణకు పర్యావరణ, అటవీశాఖలు అనుమతులు మంజూరు చేశాయి. ఎనిమిదేళ్లుగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పునరుద్దరానికి సిద్ధమైంది. ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనుండగా, ఇది ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి వరకు సాగనుంది.

భూసేకరణ దాదాపు పూర్తీ – రైతులకు పరిహారం

ప్రాజెక్టు ప్రారంభానికి ముందు NHAI శాటిలైట్ సర్వే నిర్వహించి, జనావాసాల్ని దాటి, కనీస భూసేకరణతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. మెట్‌పల్లి మండలం నుంచి వెల్గటూర్‌ మండలానికి మధ్య 250 హెక్టార్ల భూమిని 240 మంది రైతుల నుంచి సేకరించారు. భూములు కోల్పోయిన రైతులకు తుది అవార్డులు ప్రకటించాల్సి ఉంది, అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేయనున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి మండలంలో సమస్యలపై రైతుల ఫిర్యాదులకు స్పందిస్తూ, అధికారులు భవిష్యత్‌లోని అసంతృప్తిని నివారించే చర్యలు తీసుకుంటున్నారు.

రూ. 2,529 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం

కేంద్రం ఈ రహదారి (Greenfield Highway) విస్తరణ కోసం రూ. 2,529 కోట్లు కేటాయించింది. మొత్తం 125 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించనున్నారు. రహదారి పట్టణాలను తాకకుండా పూర్తిగా బైపాస్ మార్గాల్లో నిర్మించబడుతుంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోగా, పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు, రవాణా వేగం మెరుగవుతాయి. టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు త్వరలోనే తుది అవార్డులు ప్రకటించనున్నట్లు NHAI వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రాంతీయ అభివృద్ధికి ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.

Read Also : Aditi Bhavaraju : కీలక పాత్రలో కనిపించనున్న అదితి భావరాజు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870