తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను సరిచేయాలనే లక్ష్యంతో జూన్ 13వ తేదీలోపు టీచర్ల సర్దుబాటు (Adjustment of teachers) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. వారికి ఒక సంవత్సరం పాటు తాత్కాలిక బదిలీలకు పూర్తి అధికారం ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
పంచాయతీ నుంచి జిల్లా స్థాయిలో మార్పులు
టీచర్ల సర్దుబాటును మూడు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మొదటగా పంచాయతీ పరిధిలో, అనంతరం మండలం, తరువాత పొరుగు మండలాలు, చివరగా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించాలి. ఈ విధంగా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, తగిన స్థాయిలో టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఈ నిర్ణయం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికే అని చెబుతోంది.
సమయపాలనపై టీచర్ల సంఘాల అభ్యంతరం
అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన గడువు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా TSUTF (తెలంగాణ స్టేట్ యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్), TSPTA (తెలంగాణ స్కూల్స్ పైనరీ టీచర్స్ అసోసియేషన్) జూన్ 13లోపు సర్దుబాటు పూర్తిచేయడం ప్రయాసకరంనని పేర్కొంటున్నాయి. ఏర్పడే జాప్యం, లోపాల వల్ల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.
Read Also : Welfare Calendar : త్వరలో సంక్షేమ క్యాలెండర్ – సీఎం చంద్రబాబు