ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల తూటాల యుద్ధం మళ్లీ వేడెక్కింది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు:
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తోపుదుర్తి ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు, యువతకు, మహిళలకు ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలయ్యే సూచనలు కనిపించడంలేదని విమర్శించారు.
మహానాడు – ఎన్టీఆర్ కుటుంబం గైర్హాజరు అంశంపై స్పందన:
మహానాడు కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మహానాడులో ప్రదర్శించిన ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తన రాజకీయ లబ్దికోసం ఎన్టీఆర్ గౌరవాన్ని కూడా రాజకీయ హథ్యంలోకి లాగుతున్నాడు చంద్రబాబు, అని విమర్శించారు.
చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, “చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందనే అనుమానాలు కలుగుతున్నాయి. చేయనివాటిని కూడా తానే చేశానని చెప్పుకుంటున్నాడు. ఇది ప్రజలను మోసం చేయడం,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా “రెడ్ బుక్” పేరుతో నారా లోకేశ్ చేసిన ప్రచారాన్ని ఆయన ఎద్దేవా చేస్తూ – సిగ్గుచేటు అన్నారు.
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టులపై దుయ్యబాటు
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు అంటూ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వెన్నుపోటు, కరవు, అబద్ధాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదని సీమ ద్రోహి అని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, జగన్ అని అన్నారు. వారు చేస్తున్న అభివృద్ధి, నీటి ప్రాజెక్టులు, ప్రజల సంక్షేమం – ఇవే నిజమైన రాయలసీమ బిడ్డల లక్షణాలు, అని తెలిపారు.
Read also: Vallabhaneni Vamsi: చికిత్స కోసం వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు