हिन्दी | Epaper

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

Shobha Rani
Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపు లాభ- నష్టాల మధ్య చలించాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్లు అండతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్‌ (Stock market) ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 320 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 24,800 పైన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,312.32) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,106.98 – 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,892.60 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు 85.50 వద్ద ముగిసింది.

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..
Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 65.84 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also: Wipro:డ్యూటీకి వచ్చిన ఉద్యోగులకు విప్రో భారీ షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870