రాజన్న సిరిసిల్ల (Sircilla ) జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్య(brutal murder of a woman)కు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తున్న సమయంలో, నడిరోడ్డుపైనే ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి అతి క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామమంతా భయాందోళనల మధ్య వణికిపోయింది.
రోడ్డు పై కత్తితో దాడి – ఘటన స్థలంలోనే మృతి
సాధారణంగా ప్రతి రోజు చేసేలా ఆ మహిళ పొలానికి వెళ్లి, సాయంత్రం ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో మార్గమధ్యంలోకి వచ్చిన ఓ యువకుడు ఆమెపై ఆకస్మికంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర దృశ్యాన్ని చూశిన స్థానికులు తీవ్ర షాక్కు గురయ్యారు.
నిందితుడు లొంగిపోవడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. “ఆమెను నేనే చంపాను” అంటూ కత్తితో సహా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడికి ఇప్పటికే ఒక హత్య కేసులో నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వినాయక చవితి సందర్భంగా మరో వ్యక్తిని హత్య చేసిన కేసులో అతనిపై నమోదైన అభియోగాల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్య వెనక ఉన్న కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
Read Also : 2027 Godavari Pushkaralu : జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన – మంత్రి దుర్గేశ్