ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కోనసీమ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలంలోని కమినిలంక వద్ద గోదావరి నదిలో (In the Godavari River) స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.కె.గంగవరం మండలం శురుల్లంక గ్రామంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి పలువురు యువకులు హాజరయ్యారు. వేడుక అనంతరం సమీపంలోని కమినిలంక వద్ద గోదావరి తీరానికి వెళ్లి సరదాగా స్నానానికి దిగారు. అయితే వారు స్నానం చేసిన ప్రాంతంలో నది లోతుగా ఉండటంతో ప్రమాదం జరిగింది. నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు.మిగిలిన ముగ్గురు యువకులు ఎంతకష్టమైనా ఒడ్డుకు చేరగలిగారు. గల్లంతైన వారి కోసం అధికారుల సహాయంతో గాలింపు కొనసాగుతోంది.
గల్లంతైన యువకుల వివరాలు
ఇప్పటికే గల్లంతైన ఎనిమిది మంది యువకులను గుర్తించారు. వారు క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మరో మహేశ్. వీరంతా కాకినాడ, రామచంద్రపురం, మండపేట ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో సహా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సీఎం, డిప్యూటీ సీఎం స్పందన
ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు… గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు… దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన యువకులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలను వేగంగా, సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాల పరిస్థితి
ఘటనాస్థలికి చేరుకున్న గల్లంతైన యువకుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు.ఇలాంటి విషాద ఘటనలు ఇక పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. గోదావరి తీర ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు, సురక్షిత స్నాన ప్రాంతాల గుర్తింపు చేయాల్సిన అవసరం ఉంది.
Read Also : Andhrapradesh: రేషన్ వాహనాల రద్దుపై రోడ్డెక్కిన ఆపరేటర్లు