ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య భారతదేశం అభివృద్ధి పట్ల తన ప్రభుత్వ దృష్టిని పునరుద్ధరించారు. ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతున్నదని, ఈ ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి (PM Modi)మోదీ ఈ వ్యాఖ్యలను ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో (‘Rising North East Investors Summit’) ప్రసంగిస్తూ చేశారు. ఈశాన్య ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం అని, ఈ ప్రాంతం అభివృద్ధి మార్గంలో ముందు వరుసలో నిలుస్తోందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రసంగించారు. ఈ ఈవెంట్కు ఈశాన్య రాష్ట్రాల (Northeastern states)ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలతో పాటు తదితరులు హాజరయ్యారు.

అష్టలక్ష్మి’ అభివృద్ధి దృక్పథం
ప్రధానమంత్రి మోదీ ఈశాన్య భారతదేశాన్ని “అష్టలక్ష్మి”గా అభివర్ణించారు, అంటే ఎనిమిది రూపాల సంపదగా. ఈ ప్రాంతం ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, వాణిజ్యం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి ఎనిమిది ముఖ్యమైన రంగాల్లో దక్షత కలిగి ఉంది. ఈశాన్య ప్రాంతం భద్రతా పరంగా కీలకమైన ప్రాంతమని, అందుకే మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
గతంలో ఈశాన్య ప్రాంతం అంటే బాంబులు, తుపాకులు, రాకెట్లకు మారుపేరుగా ఉండేదని, దానివల్ల యువత చాలా అవకాశాలు కోల్పోయారని నరేంద్ర మోదీ అన్నారు. అయితే గత దశాబ్ద కాలంలో నార్త్ఈస్ట్ యువత హిసంను వదిలిపెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉపేక్షించడం లేదన్నారు.
కీలక రంగాలపైనే ఫోకస్!
పర్యటకం, వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్ అనుబంధ రంగాలు, వస్త్రాలు, చేనేత, హస్తకళలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత- సమాచార సాంకేతికత ఆధారిత సేవలు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, వినోదం, క్రీడా రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంపై ఈ సమిట్ ప్రధానంగా దృష్టి సారించింది.
Read Also : Jai Shankar: ఉగ్రవాదులు ఎక్కడ ఉంటారో మాకు తెలుసు: జైశంకర్