ఏడు కంపెనీల పబ్లిక్ ఇష్యూ(Ipo) ల దరఖాస్తులకు సెబీ (Sebi) ఆమోదముద్ర వేసింది. ఈ ఏడు కంపెనీల్లో విద్యా రుణాలు అందించే క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (గతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్), ఏడు కంపెనీల పబ్లిక్ ఇష్యూల దరఖాస్తులకు సెబీ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడు కంపెనీల్లో విద్యా రుణాలు అందించే క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (గతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్), శ్రీ లోటస్ డెవలపర్స్, యూరో ప్రతీక్, క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, జెసన్స్ ఇండస్ట్రీస్, జెమ్ ఏరోమాటిక్స్ ఉన్నాయి. ఇవి మొత్తంగా రూ.3,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది.
క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రి-ఫిల్లింగ్ పద్ధతిలో సెబీకి తొలి పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ)(Ipo) సంబంధించిన ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఈ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే ముసాయిదా పత్రాల్లోని వివరాలను కంపెనీలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉండదు.

శ్రీ లోటస్ డెవలపర్స్ రూ.792 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారానే ఈ ఇష్యూ ఉండనుంది.
యూరో ప్రతీక్ పబ్లిక్ ఇష్యూ (Ipo) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరగనుంది. రూ.730 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
క్యాలిబర్ మైనింగ్ లాజిస్టిక్స్ ఐపీఓ (Ipo) ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో రూ.100 కోట్ల షేర్లను విక్రయించాలని అనుకుంటోంది.
జారో ఇన్స్టిట్యూట్ రూ.170 కోట్ల విలువైన తాజా షేర్లను, ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్లు మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.
జెసన్స్ ఇండస్ట్రీస్ రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయడంతో పాటు ఓఎఫ్ఎస్లో 94.61 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
జెమ్ ఏరోమాటిక్స్ రూ.175 కోట్ల విలువైన తాజా షేర్లను; ఓఎఫ్ఎస్ పద్ధతిలో ప్రమోటరు, ఒక ఇన్వెస్టర్ 89.24 లక్షల షేర్లను విక్రయించనున్నారు.
ఐతే ఈ ఏడు ఐపీఓ(Ipo) ల విలువను కలిపితే సుమారు రూ.3,000 కోట్లు ఉంటుంది. మార్కెట్లో నూతన పెట్టుబడులకు ఇది దోహదం చేయనుంది. అనేక రంగాల్లోని సంస్థలు ఉన్నందున, ఇన్వెస్టర్లకు డైవర్సిఫైడ్ ఎంపికలు లభించనున్నాయి.
Read Also: London: భారత్ మార్కెట్లో జేఎల్ఆర్ వ్యాపార విస్తరణ లక్ష్యం: ఎండీ రాజన్ అంబా